
వేసవి సెలవుల్లోనే టీచర్లకు శిక్షణ
డీఈఓ వాసంతి
విద్యారణ్యపురి: పాఠశాల విద్యాశాఖ ఈ వేసవి సెలవుల్లో టీచర్లకు శిక్షణ నిర్వహించనున్నట్లు, ముందుగా రిసోర్స్పర్సన్లకు శిఽక్షణ ఇస్తున్నట్లు హనుమకొండ డీఈఓ వాసంతి అన్నారు. రాష్ట్రస్థాయిలో గణితం, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్లకు కాజీపేటలోని ఫాతిమానగర్లోని బాలవికాస్లో శిక్షణను సోమవారం ఆమె ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలతో ఆయా జిల్లాల్లో గణిత, సాంఘిక శాస్త్రం సబ్జెక్టు టీచర్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రెండు సబ్జెక్టుల్లో రాష్ట్ర స్థాయిలోని 33 జిల్లాలకు సంబంధించిన ఎంపిక చేసిన రిసోర్స్పర్సన్లకు శిక్షణ కార్యక్రమాలు ఈజిల్లాలో ఐదురోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈశిక్షణలో ప్రతీ జిల్లా నుంచి నలుగురు చొప్పున గణితంలో 139 మంది, సాంఘికశాస్త్రంలో 139 మంది జిల్లా స్థాయి రిసోర్స్పర్సన్లు పాల్గొన్నారు. శిక్షణ ఎస్సీఈఆర్టీ ఫ్యాకల్టీ ఇన్చార్జులుగా గణపతిశర్మ, ఎల్లయ్య, స్టేట్ రిసోర్స్పర్సన్లు బండారి రమేశ్, కందాల రామయ్య రతంగపాణి, ప్రభాకర్రెడ్డి, హనుమకొండ జిల్లా క్వాలిటీ కో– ఆర్డినేటర్ ఎ శ్రీనివాస్, కాజీపేట మండల విద్యాశాఖ అధికారి బండారి మనోజ్కుమార్ పాల్గొన్నారు. ఈనెల 9 వరకు శిక్షణ కొనసాగనుంది.