
జర్నలిజంతో విస్తృత ఉపాధి అవకాశాలు
● దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ సురేష్లాల్
కేయూ క్యాంపస్: జర్నలిజం కోర్సు పూర్తిచేసిన వారికి మీడియాలో విస్తృత ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్నాయని కేయూ దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ సురేష్లాల్ అన్నారు. దూరవిద్యా కేంద్రంలో 2022 – 2024లో జర్నలిజం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆధునిక సమాజంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల విస్తృతి కారణంగా ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా క్షణాల్లో సమాజంలో అన్ని వర్గాలకు సమాచారం అందుతోందన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజా సంబంధాల అధికారి, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ స్టాఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరమణ, జర్నలిజం విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ సంగని మల్లేశ్వర్, అధ్యాపకులు నర్సింహరాములు, వెంకటేశ్వర్లు, సురేందర్, చిరంజీవి, శంకర్ పాల్గొన్నారు.