
మేమెంతో.. మాకంత కావాలి
హన్మకొండ: రాష్ట్రంలోనే అధిక జనాభా ఉన్న కులం ముదిరాజ్ కులమని, తమకు రిజర్వేషన్ ఫలాలు, రాజ్యాధికారంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ముదిరాజ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ అన్నారు. మేడారంలో చేపట్టిన ముదిరాజ్ల ఆత్మగౌరవ యాత్ర మేడారం నుంచి ములుగు, నల్లబెల్లి, నర్సంపేట మీదుగా 15వ రోజు ఆదివారం వరంగల్, హనుమకొండకు చేరుకుంది. ఈమేరకు హనుమకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ల ఆత్మగౌరవం కోసం పాదయాత్ర చేపటినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో అధిక జనాభా ఉన్నా రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామెంతో.. తమకంత రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వకపోతే పార్టీలకు బుద్ధి చెబుతామన్నారు.