మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం | - | Sakshi
Sakshi News home page

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

May 5 2025 10:22 AM | Updated on May 5 2025 10:22 AM

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

ఎల్కతుర్తి : బీసీ కుల, జనగణన చేపట్టేందుకు కేబినెట్‌లో ఆమోదం తెలిపిన సందర్భంగా ప్రధాని మోదీ చిత్రపటానికి ఆదివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద బీజేపీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు మాట్లాడుతూ కేంద్ర కేబినెట్‌లో కులగణన చేపట్టేందుకు ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు దేశంలో కులగణన చేపట్టలేదని విమర్శించారు. బీసీల హ క్కులను కాలరాయడం, బీసీల హక్కులు, రిజర్వేషన్లు అణచివేవయడం వారి నైజం అని విమర్శించారు. కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ పైడిపెల్లి పృధ్వీరాజ్‌, నాయకులు ఊసకోయిల కిషన్‌, వేణు, రమేష్‌, సురేష్‌, సదానందం, అంబీర్‌ కవిత, సంపత్‌, రాణాప్రతాప్‌, వికాస్‌, వీరన్న, శ్యామ్‌, రాజేందర్‌, జ్ఞానేశ్వర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement