
ఆలయ కమిటీ చైర్మన్గా రమేశ్
సంగెం : మండలంలోని ఎల్గూర్ స్టేషన్ గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గమ్మ, హనుమాన్, పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్గా డాక్టర్ రమేశ్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలయ ఆవరణలో ఆది వారం నిర్వహించిన సమావేశంలో కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడుగా జీజుల సమ్మయ్య, ఉపాధ్యక్షుడుగా మోహన్, కన్వీనర్గా రమేశ్, కో–కన్వీనర్ మహేందర్, కోశాధికారిగా వెంకన్న, ఆర్గనైజర్గా శాఖపురి రత్నాకర్, కల్చరల్ కమిటీ సభ్యులుగా ప్రవీణ్, మురళీ, వీరన్న, వెంకన్న, సురేందర్, వెంకటేశ్, హరిలాల్, శివశంకర వరప్రసాద్, అనిల్, రాజు ఎన్నికయ్యారు.