
ఘనంగా పోచమ్మ బోనాలు
కమలాపూర్ : శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాల్లో భా గంగా మండల కేంద్రంలో ఆదివారం గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తులు పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గౌడ కులానికి చెందిన మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తరలివెళ్లారు. అక్కడ పోచమ్మ తల్లికి బోనాల నైవేధ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుని తమ పిల్లా పాపలను చల్లగా చూడాలని వేడుకున్నారు. కార్యక్రమంలో గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పబ్బు ఎల్లాగౌడ్, ఉపాధ్యక్షుడు జక్కు ప్రభాకర్, కోశాధికారి పచ్చిమట్ల రాజేశ్బాబు, డైరెక్టర్లు సమ్మయ్య, పెరుమాండ్ల భూపాల్, బాలసాని రవి, మండ రాజు, పబ్బు సది, జేరుపోతుల పుల్లయ్య, కారోబార్ కుమారస్వామి, గౌడ మహిళలు, గౌడ కులస్తులు పాల్గొన్నారు.