గ్రామాల అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

May 5 2025 10:22 AM | Updated on May 5 2025 10:22 AM

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

గ్రామాల అభివృద్ధే లక్ష్యం

కమలాపూర్‌ : గ్రామాల అభివృద్ధే తన లక్ష్యమని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. మండలంలోని గుండేడులో ఆదివారం జరిగిన శి వాలయం, మడేలయ్యస్వామి, పోచమ్మ దేవతల విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుండేడు గ్రామ ప్రజలు, నాయకులు, అన్ని కులాల పెద్దలు పార్టీలకతీతంగా వచ్చి తమ గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేసి గ్రామ దేవాలయాల అభివృద్ధికి సాయం కోరగా స్పందించిన ఎమ్మెల్యే అభివృద్ధి కోసం రూ.10 లక్షల విరాళం ప్రకటించి గ్రామస్తుల సమక్షంలో ఆదివారం రూ.10 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మాచారు. ఎమ్మెల్యే చేయూతతో గ్రామ అభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని భీంపల్లిలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

గుండేడుకు రూ.10 లక్షల విరాళం

అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement