కార్మికులను బానిసలుగా మార్చేందుకు కుట్ర | - | Sakshi
Sakshi News home page

కార్మికులను బానిసలుగా మార్చేందుకు కుట్ర

May 5 2025 10:22 AM | Updated on May 5 2025 10:22 AM

కార్మికులను బానిసలుగా మార్చేందుకు కుట్ర

కార్మికులను బానిసలుగా మార్చేందుకు కుట్ర

వరంగల్‌: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వ చ్చిన మోడీ ప్రభుత్వం.. కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకే నాలుగు లేబర్‌కోడ్‌లను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ అన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) నిర్మాణ జనరల్‌ బాడీ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్‌ అధ్యక్షతన పోచమ్మమైదాన్‌లోని విస్‌డమ్‌ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను నా లుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చడమే కాకుండా, గతంలో ఉన్న రోజుకు 8గంటల పనిదినాలను తీసివేసి 12 గంటల పని దినాలుగా మార్చాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. టీపీటీఎఫ్‌ పూర్వ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్‌ మాట్లాడుతూ నేడు భారత కార్మిక వర్గం సంక్షోభంలోకి నెట్టివేయబడిందని వాపోయారు. ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాచర్ల బాలరాజు, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్‌, పీవైఎల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కానుగుల రంజిత్‌ తదితరులు మాట్లాడారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎ న్నుకున్నారు. అధ్యక్షుడిగా గంగుల దయాకర్‌, ఉపాధ్యక్షులుగా సీహెచ్‌.నర్సింగం, బరిగెల కుమార్‌ ప్రధాన కార్యదర్శిగా ఎలకంటి రాజేందర్‌, సహాయ కార్యదర్శులుగా బండి కుమార్‌, బన్న నర్సింగం, కోశాధికారిగా గొర్రె ప్రదీప్‌తోపాటు 15 మంది జిల్లా కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement