
జంక్షన్ పనులు వేగవంతం చేయాలి
ఎల్కతుర్తి : ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభా కర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని జంక్షన్, సుందరీకరణ పనుల్లో భాగంగా జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంక్షన్ సుందరీకరణ పనుల్లో భాగంగా వాటర్ ఫౌంటేన్, గార్డెన్ గ్రీనరీ సెంట్రల్ లైటింగ్ సిస్టం హనుమకొండ వైపు గల ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు, జంక్షన్ నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు సుందరీకరణ పనులు కొనసాగించాలని సంబంధిత కాంట్రాక్టర్కు ఆదేశించారు. పలు పనులపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మంత్రి పరిశీలించారు. కార్యకర్తలు, అధికారులతో కలిసి అల్ఫాహారం చేసి పెండింగ్ పనులపై అధికారులతో ఆరా తీశారు. కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నా రు. మంత్రి వెంట నాయకులు బొమ్మనపల్లి అశోక్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సుకినె సంతాజీ, గోలి రాజేశ్వర్రావు, మహేందర్, సుమన్, రమేష్, వెంకటేష్, సురేందర్, నవీన్ తదితరులు ఉన్నారు.
సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్