
అదనపు కలెక్టర్ శ్రీనుకు శుభాకాంక్షలు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మేన శ్రీనును మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారులు, ఎంపీడీఓల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పెద్ది అంజనేయులు, సంఘం నాయకులు కలిశారు. హనుమకొండ కలెక్టరేట్లో మేన శ్రీను ఎంపీడీఓలు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేన శ్రీను మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ఎంపీడీఓల పాత్ర కీలకమని గుర్తుచేశారు. అందరూ కష్టపడి జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో నిలపాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓల సంఘం ఉపాధ్యక్షుడు మొగుళ్ల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి నందం విజయకుమార్, ఎంపీడీఓలు రామడుగు లక్ష్మిప్రసన్న, కె.అనిల్ కుమార్, గుండె బాబు, గజ్జెల విమల, చిరబోయిన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.