
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈనెల 5న విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగనుందని డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. తరాలపల్లి, రాంపేట ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, హనుమకొండ జిల్లా బస్స్టేషన్ రోడ్డు, హనుమకొండ చౌరస్తా, ఏనుగుల గడ్డ, పింజర్ల ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేయూలో ఇద్దరికి డాక్టరేట్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఆంగ్ల విభాగం పరిశోధకులు జి.సురేష్కుమార్, ఎస్.స్వాతికి యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఎన్విరాన్మెంటల్ పరస్పెక్టివ్ ఇన్ ది సెలెక్ట్ నావెల్స్ ఆఫ్ మార్గరేట్ అట్వూడ్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి సురేష్కుమార్కు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్ తెలిపారు. అలాగే, సఫరింగ్ అండ్ ప్రొటెస్ట్ ఇన్ సెలెక్ట్ నావెల్స్ గీతాహరిహరన్ అండ్ అనితానాయర్ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి స్వాతికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఆంగ్ల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపాజ్యోతి పర్యవేక్షణలో వారు తమ పీహెచ్డీ పూర్తిచేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో సురేష్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. కేయూలో కాంట్రాక్టు సీనియర్ అసిస్టెంట్గా స్వాతి విధులు నిర్వర్తిస్తున్నారు.
బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు, డివిజన్ల అధ్యక్షుల నియామకం
హన్మకొండ: బీజేపీ హనుమకొండ జిల్లా కౌన్సిల్ సభ్యులు, నగరంలోని డివిజన్ల అధ్యక్షులను జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ప్రకటించారు. జిల్లా కౌన్సిల్ సభ్యులుగా బొమ్మసాని అనిల్, వాసం కరుణ, కేతిపల్లి సంపత్ రెడ్డి, గుండ్ల శ్రీనివాస్, జంపాల పూర్ణచందర్, జన్ను మధు, పి.రాంరెడ్డిని నియమించినట్లు తెలిపారు. 8వ డివిజన్ అధ్యక్షుడిగా రాకేష్, 10వ డివిజన్ ఉడుతల మురళి, 30వ డివిజన్ నూకల ఉషాదేవి, 51 డివిజన్ డి.శివ రెడ్డి, 53వ డివిజన్ పెరమాండ్ల రామకృష్ణ, 58వ డివిజన్ నద్దునూరి మోహన్దాస్, 59వ డివిజన్ అధ్యక్షుడిగా వైల జితేందర్ను నియమించినట్లు ఒక ప్రకటనలో వివరించారు.
మున్నూరు కాపు పరపతి
సంఘం కార్యవర్గం ఎన్నిక
హన్మకొండ అర్బన్: హనుమకొండ పద్మాక్షిరోడ్డులోని శ్రీఆంజనేయ మున్నూరు కాపు పరపతి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈమేరకు హనుమకొండలో పద్మాక్షికాలనీలోని శ్రీప్రసన్నాంజనేయ దేవాలయంలో సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా 2025 – 2027వ సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా కనుకుంట్ల రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా తోట ప్రకాష్, కోశాధికారిగా కర్ర దశరథ్ కుమార్, ఆడిటర్గా దేవులపల్లి సంపత్, కార్యవర్గ సభ్యులుగా నల్ల జనార్ధన్, కొండ్ర సతీష్కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల నిర్వహణాధికారిగా గందె కృష్ణ వ్యవహరించారు. హనుమాన్ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ప్రతీ సంవత్సరం దేవాలయానికి సంఘం నుంచి రూ.75 వేలు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
వెలమ సంక్షేమానికి కృషి
హన్మకొండ చౌరస్తా: వెలమ సంక్షేమ సంఘం బలోపేతానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ తక్కళ్లపెల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. హనుమకొండ పెద్దమ్మగడ్డ సమీపంలోని ఏఆర్ఆర్ గార్డెన్లో వెలమ సంక్షేమ సంఘం 30వ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పేరాల మధుసూదన్ రావు, కాకులమర్రి ప్రవీణ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యే సత్యనారాయణ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. తామందరం ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. సంఘం బలోపేతం చేస్తూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా పలు కార్యక్రమాలు చేసుకుందామని అన్నారు. అనంతరం సంఘం కార్యదర్శి ప్రవీణ్కుమార్ సంఘం వ్యవస్థాపక సభ్యులను స్మరించుకుంటూ సంఘం బలోపేతానికి పాటుపడుతున్న పెద్దలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గుజ్జ ప్రభాకర్రావు, తక్కళ్లపెల్లి శ్యాంసుందర్రావు, జాయింట్ సెక్రటరీ తక్కళ్లపెల్లి రవీందర్రావు, స్వామిరావు, బాలకిషన్రావు తదితరులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు