
ఉత్తమ ఫలితాలు అభినందనీయం
న్యూశాయంపేట: మైనార్టీ గురుకులాలు ఇంటర్, పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని ప్రముఖ సీ్త్ర వైద్య నిపుణురాలు డాక్టర్ రాణా సిద్దిఖీ అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన మైనార్టీ గురుకులాలు, ఇతర కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లను హనుమకొండలో మైనార్టీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు నర్సంపేట (జీ1) శ్రీపాల, వరంగల్ (జీ1) దాసరి కృష్ణకుమారి, డోర్నకల్ (జీ1) రిజ్వానా బేగం, జనగామ (బి1)కుమార్, సాహిన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రిజ్వాన్, ఫోరం ప్రతినిధులు సయ్యద్ అక్బర్, రజామాలిక్, ఎం. ఖలీం, నాజ్నీన్, నయీం పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగికి సన్మానం
విద్యారణ్యపురి: వరంగల్కు చెందిన హనుమకొండ డీఈఓ కార్యాలయంలో 2018 నుంచి 2024 వరకు ఏసీజీఈగా పనిచేసి హైదరాబాద్లో ఎస్ఎస్సీ బోర్డులో సహాయ కమిషనర్గా, కార్యదర్శిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన డి.చలపతిరావును పలువురు సన్మానించారు. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన సన్మాన కార్యకమంలో హనుమకొండ ఏసీజీఈ భువనేశ్వరి, పలువురు హెచ్ఎంలు, సిబ్బంది సన్మానించారు.
కొవ్వొత్తుల ర్యాలీ
హన్మకొండ: పహల్గాంలో పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలను కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు డిమాండ్ చేశారు. శివాజీ యువజన భక్త మండలి ఆధ్వర్యంలో మృతులకు నివాళి అర్పిస్తూ హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు కాగడాలు, కొవ్వొత్తులతో ఆదివారం ర్యాలీ నిర్వహించారు.

ఉత్తమ ఫలితాలు అభినందనీయం