
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మడికొండ: మడికొండ ప్రభుత్వ పాఠశాలలో 1999 – 2000వ సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం నాటి గురువులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పొనగోటి వెంకట్రావు, కోన మారుతి, నర్ర శ్రీనివాస్, పేర్ల సురేష్, బన్న శ్రీనివాస్, కొమురవెళ్లి నరేష్, లక్ష్మణ్రాజ్, దీపిక, లక్ష్మి, వెరోనిక, సుజాత, జయరాజు, తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి పైలట్ ప్రాజెక్టుగా వర్ధన్నపేట
వరంగల్: భూభారతి చట్టం–2025 అమలులో భాగంగా వర్ధన్నపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఈనెల 5 నుంచి 14 వరకు మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. సదస్సుల నిర్వహణ కోసం రెండు బృందాలు ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ భూములతోపాటు గ్రామస్థాయిలో ఉండే భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.