ఇదీ ఓ గెలుపేనా..? | - | Sakshi
Sakshi News home page

ఇదీ ఓ గెలుపేనా..?

Apr 29 2025 7:09 AM | Updated on Apr 29 2025 7:09 AM

ఇదీ ఓ గెలుపేనా..?

ఇదీ ఓ గెలుపేనా..?

పట్నంబజారు: కేవలం తొమ్మిది నెలల మేయర్‌ పదవి కోసం నానా గడ్డి కరిచి, కక్కుర్తి పడాల్సిన అవసరం కూటమి నేతలకు వచ్చిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. బృందావన్‌ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేయర్‌ ఎన్నికకు సంబంధించి అచ్చాల వెంకటరెడ్డిని మేయర్‌ అభ్యర్ధిగా పార్టీ అధిష్టానం నిర్ణయించిందని, వైఎస్సార్‌ సీపీకి 27 ఓట్లు రాగా, 34 ఓట్లు వచ్చాయని తెలిపారు. అయితే కేవలం 11 మంది కార్పొరేటర్లు మాత్రమే కూటమికి ఉన్నారని, వైఎస్సార్‌ సీపీ గుర్తుపై గెలిచిన 17 మందిని అక్రమంగా ప్రలోభాలకు గురి చేసి కొనుగోలు చేసి, ఏకంగా ఎంపీ, ఎమ్మెల్యేలు వెళ్లి వారికి కండువాలు కప్పారని ఆరోపించారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్‌లు గైర్హాజర్‌ కావటంపై అనుమానాలు ఉన్నాయన్నారు.

నిస్సిగ్గుగా కొనుగోలు చేశారు..

2021 ఎన్నికల్లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో కేవలం 12 మంది ఉన్న కూటమి, నిస్సిగ్గుగా వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌లను కొనుగోలు చేసిందన్నారు. ఫ్యాను గుర్తుపై గెలిచి, కూటమితో అంటకాగుతున్న కార్పొరేటర్‌లు, మీ అవసరం తీరాక వదిలేస్తారన్న విషయాన్ని గుర్తించాలని, గెలిచిన పార్టీని మోసం చేసిన మిమ్మల్ని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.

కూటమిది అనైతిక విజయం

విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని, కూటమిది అనైతిక విజయమని, అసలు ఇదీ విజ యమే కాదన్నారు.ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలుపొందిన కాండ్రుగుంట గురవయ్య సైతం వైఎస్సార్‌ సీపీకి మద్దతుగా నిలిచారని, పార్టీ గుర్తుపై గెలిచిన మీకు ఆ మాత్రం బుద్ధి లేదా అని సూటిగా ప్రశ్నించారు. అనైతిక విజయాన్ని మూటగట్టుకున్న కూటమి ప్రభు త్వం మూల్యం చెల్లించుకోకతప్పదని ప్రశ్నించారు. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో సైతం ఇదే విధంగా సిగ్గులేకుండా వ్యవహరించారన్నారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించిన కార్పొరేటర్‌ల అంశాన్ని అధిష్టానం, రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ దృష్టికి తీసుకుని వెళ్తామని స్పష్టం చేశారు.

ప్రలోభాలతో గెలిచారు

వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా మాట్లాడుతూ మరోసారి టీడీపీ జంపింగ్‌ జపాంగ్‌ల పార్టీ అని నిరూపించుకుందని విమర్శించారు. ప్రలోభాలకు గురి చేసి గెలిచిన గెలుపు ఒక గెలుపేనా అని మండిపడ్డారు. 24 మంది కార్పొరేటర్లు నిజాయితీ, నిబద్ధతతో పార్టీకి అండగా నిలిచారని వారికి అభినందనలు తెలిపారు. మేయర్‌గా పోటీ చేసిన అచ్చాల వెంకటరెడ్డి మాట్లాడుతూ తనను అభ్యర్ధిగా నిలబెట్టిన వైఎ స్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, తనకు ఓట్లు వేసి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, కార్పొరేటర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, నగర డిప్యూటీ మేయర్‌ బాలవజ్రబాబు, కార్పొరేటర్లు పడాల సుబ్బారెడ్డి, రామబోయిన అజయ్‌యాదవ్‌, కాండ్రుగుంట గురవయ్య, ఈచంపాటి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తొమ్మిది నెలల పదవి

కోసం ఇంత కక్కుర్తా ?

కూటమి విజయం అనైతికం,

అప్రజాస్వామికం

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

అంబటి రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement