ఐరన్‌ పంపిస్తామని మోసం.. | - | Sakshi
Sakshi News home page

ఐరన్‌ పంపిస్తామని మోసం..

Mar 28 2023 1:20 AM | Updated on Mar 28 2023 1:20 AM

గత నాలుగేళ్లుగా ఆటోనగర్‌ ఫేజు–2లో పాత ఇనుప వ్యాపారం చేస్తున్నా. శ్రీపుట్టపర్తి జిల్లాకు చెందిన ఇద్దరు సుమారు నెలక్రితం పరిచయమై, మరోకర్ని పరిచయం చేశారు. అతని వద్ద ఐరన్‌ ఉందని చెప్పారు. దీంతో 50 వేల కిలోల ఐరన్‌ సరఫరా చేస్తామని ఈ ఏడాది జనవరి 25న ఒప్పందమైంది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా రూ.38 లక్షలు పంపించా. విడిగా రూ.5 లక్షలు చెల్లించా. లారీల్లో ఐరన్‌ పంపిస్తున్నట్లు నమ్మబలికారు. తర్వాత లారీల్లో ఆయిల్‌ అయిపోయిందని చెప్పగా, రూ.70 వేలు ఫోన్‌పే చేశాను. అయితే ఇప్పటి వరకు సరుకు అందలేదు. అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారు. మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.. – మీర్‌ మహమ్మద్‌ అలీ,

శాంతినగరం, చిట్యాల, నల్గొండ జిల్లా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement