● లైంగిక వేధింపులపై అంధురాలైన కోడలు ఫిర్యాదు ● ప్రాణ రక్షణ కల్పించమంటూ ఎస్పీకి వేడుకోలు!

మామ కాదు.. కామాంధుడు!

నగరంపాలెం: పెళ్లయిన దగ్గర్నుంచి మామ లైంగికంగా వేధిస్తున్నాడు. అతనికి ఇద్దరు అత్తలు సహకరిస్తున్నారు. దీనిపై అంధురాలైన ఓ కోడలు భర్తతో కలిసి సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక– స్పందన (గ్రీవెన్స్‌)లో ఫిర్యాదు చేసింది. మామ చేస్తున్న వికృత చేష్టలను చెబుతూ విలపించింది. బాధితురాలి మాటల్లో.. 2013లో క్రితం వివాహమైంది. భర్త ప్రైవేటు విద్యుత్‌ పనులు చేస్తుంటాడు. ఒక బాబు సంతానం. మావకు ఇద్దరు భార్యలు. అయినప్పటికీ పెళ్ల యిన దగ్గర నుంచి మామ వేధించడం మొదలెట్టాడు. ఇద్దరత్తలతో సంసారం చేస్తూ, తనను లైంగిక సంసారం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. అదును చూసి బలాత్కారానికి ప్రయత్నిస్తున్నాడు. తన కోరిక తీర్చలేదని పగ పెంచుకున్నాడు. తనతోపాటు భర్తను హింసిస్తున్నాడు. కొడుకు కోసం పెళ్లి చేయలేదని, తన కోసమంటూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో 2023 జనవరి 3న ఇద్దరి అత్తల సహాయంతో తనపై లైంగిక దాడికి యత్నించి, శరీరమంతా రక్కాడు. దీంతో మన స్థాపం చెంది పురుగుమందు తాగి ఆత్మ హత్యాయత్నానికి ప్రయత్నించా. గతంలోనూ నాపై వేరే వారితో దాడి చేయించాడు. ఇవన్నీ కూడా నన్ను లొబర్చుకునేందుకు చేసినవే. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయినప్పటికీ మావ ప్రవర్తనలో మార్పులేదు. కామవాంఛతో తన పై, భర్తపై వేరే వ్యక్తులతో దాడి చేయించాడు. కేసుల్లో రాజీకి రాకపోతే అంతు చూస్తానని ఊళ్లో బహిరంగంగా చెబుతున్నాడు. పలుకుబడి ఉన్న మావ ఏదైనా చేసేందుకు సిద్ధహస్తుడని తెలిపింది. తమకు ప్రాణరక్షణ కల్పించాలని ఎస్పీని అభ్యర్థించింది.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top