
‘‘నేనేం బిట్ కాయిన్కు లేదా మరే ఇతర క్రిప్టో కరెన్సీలకు అభిమానిని కాదు. నియంత్రణ లేని క్రిప్టో ఆస్తుల వల్ల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పెరుగుతాయి.’’ 2019లో ఇదీ డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయం. కేంద్ర బ్యాంకులు, ఐఎంఎఫ్ వంటి సంస్థలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక నేరాల నిపు ణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనతో అప్పు డాయన ఏకీభవించారు. క్రిప్టో అనేది సాంకే తికమైన ఒక నూతన ఆవిష్కరణ. ఈ కరెన్సీకి ఎలాంటి వాస్తవిక విలువ, ప్రభుత్వాల గుర్తింపూ లేవు. నల్ల ధన నిరోధక చర్యలను ఇది దెబ్బతీస్తుంది.
మారిన ట్రంప్ ధోరణి
2025 వచ్చేసరికి పరిస్థితి మారింది. క్రిప్టో కరెన్సీ లాబీ నుంచి ఎన్నికల ప్రచారానికి లభించిన మద్దతు, తన కుటుంబానికి బహుమ తులుగా అందిన పెట్టుబడులు... ట్రంప్ అవగాహనను మార్చేశాయి. ఇటీవలే ఆయన తన నూతన అవగాహనతో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఒకప్పుడు తప్పనిసరి అవసరం అనుకున్న నియంత్ర ణలు ఒక్క కలం పోటుతో తునాతునకలు అయ్యాయి. ఆ తర్వాత, ట్రంప్ కుటుంబం క్రిప్టో వ్యాపారంలోకి ప్రవేశించింది. టెర్రరిజాన్ని పెంచిపోషిస్తున్న, తెరచాటు లావాదేవీలతో టెర్రరిస్టులకు నిధులను మళ్లిస్తున్న పాకిస్తాన్... స్వయంగా ఈ కుటుంబానికి ఒక వ్యాపార భాగస్వామిగా ఉంది.
మరి అమెరికా నేతలే ప్రైవేటు కరెన్సీలు నడుపుతుంటే ఇండియా దాన్ని ఎలా భావించాలి? మాజీ ఖైదీలకు పునరావాసమా అన్నట్లు వారిని తన అధికారిక క్రిప్టో కౌన్సిళ్లకు వ్యూహాత్మక సలహాదారులుగా నియమించుకున్న దేశం గురించి ఎలాంటి అభిప్రాయానికి రావాలి? చాన్గ్ పెంగ్ ఝావో(చైనాలో పుట్టిన కెనడియన్) ‘బైనాన్స్’ కంపె నీకి మాజీ సీఈవో. మనీ లాండరింగ్ నేరాలకు పాల్పడినందుకు యూఎస్ అతడిని జైల్లో పెట్టింది. తర్వాత 430 కోట్ల డాలర్లు చెల్లించి సెటిల్మెంటు చేసుకున్నాడు.
హమాస్ వంటి గ్రూపులకు నిధులు చేరవేసే అక్రమ లావాదేవీలకు బైనాన్స్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ వీలుకల్పించింది. బైనాన్స్ గూడుపుఠాణీ బట్టబయలుతో ఝావో ఆర్థికంగా అంతమై ఉండాల్సింది. కానీ పాకిస్తాన్ అధికారిక ‘క్రిప్టో టాస్క్ ఫోర్స్’కు సలహాదారు అయ్యాడు. అలాగే జస్టిన్ సన్ (చైనా మూలాలున్న సెయింట్ కిట్స్ పౌరుడు) ట్రంప్ సంబంధిత ‘వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్’లో 3 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాడు.ఈ వ్యాపారవేత్త మీద అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ఒక సివిల్ ఫ్రాడ్ కేసులో దర్యాప్తు జరిపింది. అలాంటిది రాజకీయ విరాళాల సేకరణ కార్యక్రమాలకు ఇప్పుడతడు ముఖ్య అతిథి.
అక్రమ లావాదేవీలకు మార్గం
అమెరికాలో పలుకుబడి సంపాదించుకోవడానికి క్రిప్టో లావా దేవీలు సరికొత్త మార్గంగా మారుతున్నాయి. అర్హత లేని వ్యక్తులకు, ధూర్త దేశాలకు, వాటి పాలకులకు ఇదో గేట్ వేగా మారినట్లు కన బడుతోంది. ఈ దారిలో వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జొరబడు తున్నారు. ఇలాంటి వారి పట్ల ఒకప్పుడు కఠినంగా ఉండే వ్యవస్థాగత నియంత్రణ నేడు బలహీనపడింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలపు షాడో ఫైనాన్సింగ్ (నియంత్రణ పరిధిలో ఉండని మధ్యవర్తుల ద్వారాబ్యాంకింగ్ కార్యకలాపాలు) కొత్త రూపంలో మళ్లీ తెర మీదకువచ్చింది. నేరుగా బ్యాంకుల ద్వారా కాకుండా, బ్లాక్ చెయిన్ టెక్నా లజీతో అక్రమ ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి.
శుద్ధ మైన పాలన అంటూ ప్రపంచ దేశాలకు ఉపన్యాసాలిచ్చే అగ్రరాజ్యా నికి ఇవేవీ పట్టవా? ఆర్థిక పారదర్శకతకు మంగళం పాడుతున్న క్రిప్టో టెక్నాలజీని ఇన్నోవేషన్ అంటూ రీబ్రాండింగ్ చేస్తున్నారు. భౌగోళిక రాజనీతి ఈ ముసుగులో కొత్త రూపం ధరిస్తోంది. విచ్చలవిడిగా ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను ఆమోదించడం వల్ల ప్రభుత్వాల ద్రవ్య సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. దీని వల్ల అక్రమ లావాదేవీలు వ్యాప్తిచెందుతాయనీ, వర్ధమాన దేశాల్లో విదేశీ పెట్టుబడుల రాకపోకలపై నియంత్రణ బలహీనమై కరెన్సీ మార్కెట్లు ఒడుదొడుకులకు గురవు తాయనీ ఆందోళన చెందుతోంది.
ఎల్ సాల్వడార్, నైజీరియా, లెబనాన్లలో ఇదే జరిగింది. ఈ దేశాలు క్రిప్టో కరెన్సీతో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాయి. ముఖ్యంగా టెర్రరిస్ట్ గ్రూపులు బ్యాంకుల కళ్లు గప్పేందుకు క్రిప్టో కరెన్సీలను వాడుకుంటున్నాయి. ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పదేపదే ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. అయినా సరే పాకిస్తాన్కు ఈ సంస్థ క్లియరెన్స్ లభించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న ఇండియాకు ఇది నిజంగా ముప్పు. క్రిప్టోతో ‘ఇ–హవాలా’ వాడుకలోకి వచ్చింది. సరిహద్దు లతో సంబంధం లేకుండా రియల్ టైమ్లో గోప్యంగా నగదు బదిలీ చేయడం, ‘ఇ–హవాలా’ ద్వారా సాధ్యమవుతోంది.
ఇండియా కఠినంగా ఉండాలి!
సర్వసత్తాక, సార్వభౌమాధికారం గల ఏ దేశమైనా ప్రైవేటు కరెన్సీ చలామణీని ఏ రూపంలోనూ అంగీకరించకూడదు. భారతీయ రిజర్వు బ్యాంకు ఈ విషయంలో కఠిన వైఖరి అవలంబించడం హర్షణీయం. క్రిప్టో కరెన్సీకి ససేమిరా అనడాన్ని పిరికితనం అనో, టెక్నోఫోబియా అనో భావించడం తగదు. వర్తమాన ప్రపంచంలో పెట్టుబడుల ప్రవాహాలను ఆయుధంగా వాడుకుని ఒక దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయడం సాధ్యమే. కాబట్టి ఇది జాతీయ భద్రతఅంశం. ఇలాంటి ఆర్థిక అస్త్రాల నుంచి దేశానికి రక్షణ కల్పించడానికే ఆర్బీఐ జాగ్రత్తలు తీసుకుంటోంది.
అయితే, ఆర్బీఐని లొంగదీయ డానికి తీవ్రంగా ఒత్తిడి వస్తోంది. ఫైనాన్షియల్ టెక్నాలజీలో ఇదో ఇన్నోవేషన్ అని చెబుతూ, దీనిపై ఆంక్షలను సడలించాలని ప్రపంచ క్రిప్టో వేదికలు కోరుతున్నాయి. క్రిప్టో కరెన్సీ లాభాల మీద ప్రస్తుతం ఆర్బీఐ అధిక పన్నులు విధిస్తోంది. దీనివల్ల క్రిప్టో పెట్టుబడులు విదే శాలకు తరలిపోకుండా నిరోధించాలని, ఇందుకోసం క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ తగ్గించాలని దేశీయంగా లాబీ జరుగుతోంది. పాత పద్ధతిలో భద్రతాపరమైన లోపాలు లేవా అంటూ వారు వాదిస్తు న్నారు. ఇందులో హేతుబద్ధత లేదు. ఇది ప్రమాదకరమైన వాదన. మరోవైపు అమెరికా కూడా దౌత్యమార్గాల్లో ఒత్తిడి చేస్తోంది.
ఇండియా ఎట్టి పరిస్థితిలోనూ తలొగ్గకూడదు.క్రిప్టో కరెన్సీని అడ్డుకునేందుకు ఇండియా వ్యవస్థాగత నిబంధనలను రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలి. నిఘా, ఫోరెన్సిక్ దర్యాప్తు సామర్థ్యాలు, డిజిటల్ అస్త్రాలు సంసిద్ధం చేసుకోవాలి. క్రిప్టోను అడ్డు పెట్టుకుని ‘ట్రోజన్ హార్స్’ తరహాలోఆర్థిక వ్యవస్థ మీద దాడి జరిగితే, రక్షించుకోవడానికి సర్వసన్నద్ధంగా ఉండాలి. ఆర్థిక రంగం భవిష్యత్తు అంతా డిజిటల్లోనే ఉండవచ్చు. అయినా ఈ రంగంలో మన ఉజ్జ్వల భవితకు అవసరమైన ప్రణాళికలు మన ప్రభుత్వమే రచించుకోవాలి.
విదేశీ మార్కెట్ల పటాటోపం మీద ఆధారపడకూడదు. క్రిప్టో యుగంలో మన సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడమే ప్రధానం. సరిహద్దులు, సము ద్రాలు, గగనతలం, సైబర్ స్పేస్ రక్షణకు ఎలాంటి వ్యూహాత్మక చతురతను అవలంబిస్తామో అలాంటి తీరులోనే ఈ ఆర్థిక రక్షణ వ్యూహాలు ఉండాలి. క్రిప్టో ప్రస్తుతం ఒక భౌగోళిక రాజకీయ ఆయుధం. వ్యూహాత్మకంగా హాని చేయగల శక్తి దానికి ఉంది. దాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా మన ఆర్థిక వ్యవస్థను దుర్భేద్యంగానిర్మించుకోవాలి.
- వ్యాసకర్త కార్పొరేట్ అడ్వైజర్, ‘ఫ్యామిలీ అండ్ ధంధా’ రచయిత (‘ద లైవ్మింట్’ సౌజన్యంతో)
-శ్రీనాథ్ శ్రీధరన్