డీజిల్ అరకమ విరకయాలపై చర్యలు
కొయ్యలగూడెం: డీజిల్ అక్ర మ విక్రయాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. ‘సాక్షి’లో ఈనెల 3న ప్ర చురించిన ‘యథేచ్ఛగా హైవే లో డీజిల్ దందా’ కథనానికి అధికారులు స్పందించారు. తహసీల్దార్ ఎన్.నాగరాజు గురువారం సోదాలు చేశారు. ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల (ఉమ్మ డి పశ్చిమగోదావరి జిల్లా) సరిహద్దుల ప్రాంతంలో అచ్యుతాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన సుమారు 250 లీటర్ల డీజిల్ని గుర్తించినట్టు తహసీల్దార్ తెలిపారు. రాకపోకలు సాగిస్తున్న లారీల నుంచి టీ క్యాంటీన్ య జమాని ఆయిల్ బంకులోని ధర కంటే లీటరు రూ.20 తక్కువకు కొనుగోలు చేసి ఇతర పార్టీలకు విక్రయిస్తున్నట్టు విచారణలో తెలిసింద న్నారు. క్యాంటీన్ నిర్వాహకుడిపై చర్యలకు నివేదించడంతో పాటు గుర్తించిన డీజిల్ని గోపాలపురం అధికారులకు స్వాధీనం చేశామని చెప్పారు.
డీజిల్ అరకమ విరకయాలపై చర్యలు


