
అప్రమత్తతపై మాక్డ్రిల్
ఏలూరు టౌన్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఏలూరులో పోలీస్, ఫైర్, వైద్య శాఖ అధికారులు సంయుక్తంగా మాక్ డ్రిల్ – ప్రజల భద్రతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఫైర్ స్టేషన్ సెంటర్లో డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. సంఘ విద్రోహ చర్యలు అడ్డుకోవడం, శాంతిభద్రతలు కాపాడటం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం ఈ డ్రిల్ ప్రధాన లక్ష్యం అని తెలిపారు. పేలుళ్ల సమయంలో, అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, సైరన్ మోగినప్పుడు ఎలా స్పందించాలి అనే విషయాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు, ఇతర శాఖల సమన్వయంతో చేపట్టే చర్యలను వివరించారు.

అప్రమత్తతపై మాక్డ్రిల్

అప్రమత్తతపై మాక్డ్రిల్