సాహసమే ఊపిరిగా.. | - | Sakshi
Sakshi News home page

సాహసమే ఊపిరిగా..

Mar 25 2025 2:31 AM | Updated on Apr 1 2025 4:30 PM

దెందులూరు: వారి సాహసం ఎంతో మందికి ఊపిరి పోస్తుంది. ఆపదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణం పోస్తుంది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరదలు, తుపానుల్లో చిక్కుకున్న వారిని కాపాడి రియల్‌ హిరోలుగా నిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డిజాస్టర్‌ రియాక్షన్‌ ఫోర్స్‌ (ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలు. రాష్ట్రంలో 2016 మార్చి 24న ఈ సంస్థ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. మెరికలు లాంటి శిక్షణ పొందిన పోలీసులు ఎంతోమందిని రక్షించి ప్రశంసలందుకుంటున్నారు.

324 మంది ప్రాణాలు నిలిపారు

జిల్లాలో 9 ఏళ్లలో సంభవించిన విపత్తుల్లో అతిపెద్ద విపత్తు బుడమేరు వరదలు. ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలో బుడమేరు వరదల్లో ఇన్‌స్పెక్టర జనరల్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ రాజకుమారి నాయకత్వంలో 37 బోట్లతో, 12 బృందాలు, 21 ప్రాంతాల్లో రెస్క్యూ చేశారు. జిల్లాలో 9 ఏళ్లలో ఏపీ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సాహసోపేత రెస్క్యూల ద్వారా 324 మందిని కాపాడారు. 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 5 వేల మందికి ఆహారం, తాగునీరు అందించారు. వివిధ రకాల 54 జంతువులను రక్షించారు. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 42 మృతదేహాలను వెలికి తీశారు.

యువతకు స్ఫూర్తి
యుద్ధభూమిలో సైనికులు, వరదలు తుపానులలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు విధి నిర్వహణ యువతకు స్ఫూర్తిదాయకం. చరిత్ర ఉన్నంతకాలం వారి ధైర్యం, సేవ, అంకితభావం కీర్తింపబడుతూనే ఉంటాయి.
– డాక్టర్‌ తానేటి వనిత, రాష్ట్ర మాజీ హోం మంత్రి

విపత్తుల్లో బృందాల సేవలు కీలకం
విపత్తుల సమయంలో బృందాల సేవలు స్ఫూర్తిదాయకం. సమిష్టి కృషితో విపత్తుల సమయంలో నష్ట ప్రభావాన్ని తగ్గించారు. ప్రాణాలను కాపాడటం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహారం అందించడం, మృతదేహాల వెలికితేత వంటి సేవలతో ఏపీఎన్‌డీఆర్‌ఎఫ్‌ కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుమడింప చేశారు.
– రాజకుమారి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, ఏపీ ఎన్‌డీఆర్‌ఎఫ్‌

ఎండల నుంచి కార్మికుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి 
ఏలూరు (టూటౌన్‌): అధిక ఉష్ణోగ్రతల నుంచి కార్మికుల రక్షణకు యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉప కార్మిక కమిషనర్‌ పి.శ్రీనివాస్‌ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ కార్మిక శాఖ కమిషనరు, విజయవాడ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవారం కార్మిక శాఖ కార్యాలయంలో హీట్‌ వేవ్స్‌పై సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్‌ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల నుంచి కార్మికుల రక్షణకు యాజమాన్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్మికులకు పని సమయంలో చల్లటి తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలన్నారు. 

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కార్మికులు/ఉద్యోగుల పని గంటలను రీ–షెడ్యూలింగ్‌ చేయాలన్నారు. ఓఆర్‌ఎస్‌ ఐవి ద్రవాలు వంటి అత్యవసర మందులు, ప్రథమ చికిత్స కిట్లు పని ప్రదేశాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. గది ఉష్ణోగ్రతను తగ్గించడానికి నీరు తాగడం, విండో షేడ్స్‌ ఉపయోగించడం, ఫ్యానింగ్‌, క్రాస్‌ వెంటిలేషన్‌ వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌. శ్రీనివాస్‌ డాంగే, ఆర్‌కే డబ్ల్యూసి రత్నబాబు, షేక్‌ షరీఫ్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్‌విడి ప్రసాద్‌, ఉపాధ్యక్షుడు బి.సోమయ్య, మదర్‌ థెరిస్సా బిల్డింగ్‌ వర్కర్స్‌, ఐఎఫ్‌టీయూ, ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, దుకాణాలు, సంస్థల యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు.

సాహసమే ఊపిరిగా.. 1
1/4

సాహసమే ఊపిరిగా..

సాహసమే ఊపిరిగా.. 2
2/4

సాహసమే ఊపిరిగా..

సాహసమే ఊపిరిగా.. 3
3/4

సాహసమే ఊపిరిగా..

సాహసమే ఊపిరిగా.. 4
4/4

సాహసమే ఊపిరిగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement