ఏలూరు (టూటౌన్): అగ్గిపుల్లపై వ్యోమగామి సునీతా విలియమ్స్ చిత్రాన్ని చిత్రీకరించి అబ్బుర పరుస్తున్నారు ఏలూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్బాబు. తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపి క్షేమంగా భూమిపైకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని తనదైన శైలిలో సునీతా విలియమ్స్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్ బాబుకు పలువురు అభినందనలు తెలియజేశారు.
చెల్లని చెక్కు కేసులో జైలు శిక్ష, జరిమానా
నూజివీడు: చెక్కు చెల్లని కేసులో ఒక వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చెందిన ముసునూరు ప్రభుదాస్కు గోపవరంనకు చెందిన వల్లభనేని గోపాలకృష్ణ 2017 జూన్ 25న రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత బాకీ చెల్లించే నిమిత్తం ప్రభుదాస్ రూ.5 లక్షల చెక్కు ఇచ్చాడు. ఈ చెక్కును గోపాలకృష్ణ బ్యాంకులో వేయగా ప్రభుదాస్ బ్యాంకు ఖాతాలో నగదు లేదని బ్యాంకు అధికారులు చెక్కును తిప్పి పంపారు. దీంతో గోపాలకృష్ణ కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం స్పెషల్ మేజిస్ట్రేట్ ప్రభుదాస్కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.
అనుమానాస్పద స్థితిలో రిటైర్డ్ ఉద్యోగి మృతి
చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ పాత చింతలపూడిలో రిటైర్డ్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. డి హేమప్రకాష్ (65) రిటైర్డ్ ఉద్యోగి. పాత చింతలపూడిలో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అప్పటికే ప్రకాష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా హేమ ప్రకాష్ను ఆస్తి కోసం కుటుంబ సభ్యులే కొట్టి చంపారని మృతుని సోదరుడు మోహన్ ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రకాష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసి ఎస్సై కుటుంబరావు దర్యాప్తు చేస్తున్నారు.