ఏలూరు(మెట్రో): రానున్న వేసవిలో జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో తాగునీటి సమస్య తలెత్తితే ఊ రుకోబోమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. కలెక్టరేట్లో గురువారం తాగునీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాల అమలుపై అధికారులతో ఆ మె సమీక్షించారు. జిల్లాలో తాగునీటికి సంబంధించి సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి సరఫరాపై వారంలోపు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. కాలువలకు నీటిని నిలిపివేసే లోపు గ్రామాల్లో తాగునీటి వనరులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని, బోర్వెల్స్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని, రక్షిత తాగునీటి పథకాల్లో ఫిల్టర్బెడ్స్కు మరమ్మతులు చేయించాలన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పురోగతిలో ఉన్న 325 పనులతో పాటు, ఇంకా ప్రారంభం కాని 108 పనులను జూన్ నెలాఖరులోపు పూర్తిచేయాలన్నారు. జెడ్పీ సీఈఓ కె.భీమేశ్వరరావు, ఐటీ డీఏ పీఓ కె.రాములునాయక్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ ఎస్ఈలు జి.త్రినాథబాబు, పి.నాగార్జునరావు, డీపీఓ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ నమోదు వేగిరపర్చాలి
జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లల ఆధార్ వివరాలు నమోదును పూర్తిచేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఆధార్ మోనటరింగ్ కమిటీ సమావేశాన్ని నర్విహించారు. ఆధార్ ఎన్రోల్మెంట్, ఆధార్ బయోమెట్రిక్, అప్డేట్ అంశాలపై సమీక్షించారు.
సారారహిత జిల్లాగా మార్చాలి
సారారహిత జిల్లాగా ఏలూరును మార్చేందుకు అ ధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సారా నిర్మూలనా కార్య క్రమం నవోదయం 2.0పై సమావేశం నిర్వహించా రు. ఎస్పీ కేపీఎస్ కిషోర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్తో కలిసి సమీక్షించారు. నవోదయం 2.0పై కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించారు.
మత్తుపదార్థాల నివారణే లక్ష్యం
మత్తు పదార్థాల నివారణే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో నార్కోటిక్ కో–ఆర్డినేషన్ సమావేశాన్ని ఎస్పీ కేపీఎస్ కిషోర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారి కె.రత్నప్రసాద్తో కలిసి నిర్వహించారు. డ్రగ్స్ నివారణ, సహాయం కోసం టోల్ ఫ్రీ నం.1972పై విస్తృత ప్రచారానికి స్టిక్కర్లను, కరపత్రాలను, ఆవిష్కరించారు.
కలెక్టర్ వెట్రిసెల్వి