ప్లాస్టిక్‌ రహిత నగరంగా మారుద్దాం | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ రహిత నగరంగా మారుద్దాం

Mar 16 2025 1:23 AM | Updated on Mar 17 2025 9:44 AM

ఏలూరు (టూటౌన్‌): ఏలూరును ప్లాస్టిక్‌ రహిత నగరంగా మార్చాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి పిలుపు నిచ్చారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని అన్నారు. శనివారం ఏలూరు ఆర్‌ఆర్‌ పేటలోని ఎన్టీఆర్‌ పార్కు వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్‌, ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్కులో మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్‌ రిజర్వాయర్‌ ప్రహరీ గోడకు పెయింటింగ్‌ వేశారు. సభలో ప్రతిజ్ఞ నిర్వహించి స్వచ్ఛత పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతినెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. చిత్తశుద్ధితో అందరూ పరిశుభ్రత పాటించాలని చెప్పారు. వంద మైక్రోన్ల కంటే తక్కువ ప్లాస్టిక్‌ బదులు క్లాత్‌, జ్యూట్‌ వంటి ప్రత్యామ్నాయ వస్తువులు ఉపయోగించాలన్నారు. మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌, కమిషనర్‌ భాను ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement