ఏలూరు (ఆర్ఆర్పేట): జాతీయస్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొనే జట్టుకు ఏలూరుకు చెందిన ఐదుగురు క్రీడాకారిణులు ఎంపికయ్యారని బాస్కెట్బాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె.కృష్ణారెడ్డి, గవ్వ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు .గత జనవరి 28 నుంచి 31వ తేదీ వరకూ విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా జాతీయ జట్టుకు ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఈ జట్టులో ఏలూరుకు చెందిన బీ. లీలావతి, ఏ. టాలీ అనిత, జీ. నాగదేవి, పి.వినయ శ్రీ, పాలకొల్లుకు చెందిన ఆర్.మహతి ఎంపికయ్యారని వివరించారు. వీరంతా ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరిగే 23వ జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.