అక్రమ తవ్వకాలను ఆపేదెవరు ? | - | Sakshi
Sakshi News home page

అక్రమ తవ్వకాలను ఆపేదెవరు ?

Mar 15 2025 1:49 AM | Updated on Mar 15 2025 1:48 AM

ద్వారకాతిరుమల: ఎడాపెడా ఏది చేసినా..అడిగేదెవడ్రా నా ఇష్టం అని గ్రామాల్లో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామస్థాయి నేతలు ఆయా గ్రామాల్లోని చెరువుల్లో అక్రమ తవ్వకాలకు పూనుకుంటున్నారు. మండలంలోని సత్తాల గ్రామంలో ఓ టీడీపీ నాయకుడు అక్రమ మట్టి తవ్వకాలకు తెరతీశాడు. టీడీపీ నేత మట్టి అక్రమ దందాపై సత్తాల గ్రామ ప్రజలు రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా వాటిని లెక్కచేయకుండా ఆ నాయకుడు తన పనిని దర్జాగా సాగిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మండలంలోని సత్తాల గ్రామంలో ఆర్‌ఎస్‌ నెంబర్‌ 205 లో 32.48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సత్తాల (ఇరిగేషన్‌) చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. స్థానిక టీడీపీ నాయకుడు ‘రాజు’లా ఆ పార్టీ పెద్దల అండదండలతో ఈ దందాను కొనసాగిస్తున్నాడు. ఒక్కో టిప్పర్‌ మట్టిని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు వివిధ ప్రాంతాలకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నాడు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ నాయకుడు దౌర్జన్యం చేస్తూ, బూతులు తిడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు.

చెరువు నిండా గుంతలే

అక్రమ తవ్వకాలు కారణంగా చెరువులో 10 నుంచి 15 అడుగుల లోతు గుంతలు ఏర్పడ్డాయని, వాటి వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. మట్టి రవాణా కారణంగా గ్రామంలోని రహదారులు సైతం ధ్వంసం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. మండల స్థాయి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా జరుగుతున్న ఈ అక్రమ మట్టి తవ్వకాలపై ఈ నెల 12 న జిల్లా కలెక్టర్‌కు, అలాగే మైనింగ్‌, పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. అయినా ఇప్పటివరకు ఈ మట్టి దందాకు అడ్డుకట్ట పడకపోవడం దారుణమని మండిపడుతున్నారు. అధికార పార్టీ నాయకుడికి భయపడి అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సత్తాల చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు ద్వారా పోగేసిన సొమ్మును టీడీపీ నాయకుడి నుంచి రికవరీ చేసి, ప్రభుత్వానికి జమ చేయాలని పలువురు కోరుతున్నారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన నిల్‌

సత్తాల చెరువులో కొనసాగుతున్న అక్రమ తవ్వకాలు

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

సత్తాల చెరువులో జరుగుతున్న మట్టి దందాకు అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్‌కు, ఇతర అధికారులకు కొంత మంది గ్రామస్తులతో కలిసి ఫిర్యాదు చేశాం. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలతోనే ఈ దందా సాగుతోంది.

– కుంచే రాజేష్‌, సత్తాల గ్రామస్తుడు

ఇంత దారుణమా..?

పట్టపగలు ఇష్టానుసారం చెరువును తవ్వేస్తుంటే పట్టించుకునే నాథుడు లేడు. ముడుపులు అందాయో, లేక అధికార పార్టీ నాయకులకు భయపడ్డారో? తెలియదు గానీ మట్టి అక్రమ తవ్వకాలను మాత్రం ఎవరూ అడ్డుకోవడం లేదు. ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు.

– పుల్లా అచ్చియ్య – సత్తాల గ్రామస్తుడు

అక్రమ తవ్వకాలను ఆపేదెవరు ?1
1/3

అక్రమ తవ్వకాలను ఆపేదెవరు ?

అక్రమ తవ్వకాలను ఆపేదెవరు ?2
2/3

అక్రమ తవ్వకాలను ఆపేదెవరు ?

అక్రమ తవ్వకాలను ఆపేదెవరు ?3
3/3

అక్రమ తవ్వకాలను ఆపేదెవరు ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement