చాట్రాయి తహసీల్దార్‌ సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

చాట్రాయి తహసీల్దార్‌ సస్పెన్షన్‌

Mar 14 2025 12:56 AM | Updated on Mar 14 2025 12:53 AM

అవినీతి ఆరోపణలపై కలెక్టర్‌ చర్యలు

చాట్రాయి: అవినీతి ఆరోపణల నేపథ్యంలో చాట్రాయి తహసీల్దార్‌ డి.ప్రశాంతిని కలెక్టర్‌ వెట్రిసెల్వి గురువా రం సస్పెండ్‌ చేశారు. చాట్రా యి మండలంలోని సోమవరంలో రిజిస్ట్రేషన్‌ అటవీ భూములను మ్యూటేషన్‌ చేయడం, జనార్దనవరంలో వాగు పోరంబోకు, అసైన్డ్‌ భూమికి పట్టా ఇవ్వడంపై ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కలెక్టర్‌ రెండుసార్లు షోకాజ్‌ నోటీసులు ఇచ్చినా తహసీల్దార్‌ స్పందించలేదు. అలాగే త హసీల్దార్‌ అవినీతిపై సీఎం చంద్రబాబు వద్దకూ ఫిర్యాదు లు వెళ్లాయి. సొమ్ములు తీసుకోకుండా తహసీల్దార్‌ ఏపని చేయడం లేదని మండల ప్రజలు అంటున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు కోరగా ఇవ్వనని, మంత్రి పార్థసారథిని వెళ్లి కలవాలనడం, గ్రావెల్‌ కోసం నరసింహరావుపాలెం పంచాయతీ తీర్మానం చేసినా అ నుమతులు ఇవ్వకపోవడం వివాదాస్పదమయ్యా యి. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ వారికి అనుమతులు ఇవ్వడం, వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆమె కార్యాలయానికి వెళితే పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. టీడీపీకి చెందిన ఇద్దరు వ్యకులు తహసీల్దార్‌కు షాడోలుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. తనకు మంత్రి అండదండలు ఉన్నాయని తహసీల్దార్‌ ప్రశాంతి బహిరంగంగా మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement