జంగారెడ్డిగూడెం: మడకం యాకోబుపై దాడి చేసిన కన్నాపురం రేంజర్ శివరామకృష్ణ. సబ్ డీఎఫ్ఓ వెంకటసుబ్బయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, విధులు నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గురువారం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న యాకోబును పరామర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, గిరిజన నేత కూరం సత్యనారాయణ మా ట్లాడుతూ బుట్టాయగూడెం మండలం గొ ల్లపూడి గ్రామానికి చెందిన యాకోబు తనకున్న పట్టా భూమిలో కలపను తీసి బయటకు తోలే క్రమంలో కన్నాపురం అధికారులు అడ్డు కున్నారన్నారు. దీనిపై ప్రశ్నించేందుకు కన్నాపురం రిజర్వ్ ఆఫీస్కు వెళ్లిన యాకోబును రేంజర్, సబ్ డీఎఫ్ఓ విచక్షరహితంగా కొట్టడమే కాకుండా కులం పేరుతో దూషించారని మండిపడ్డారు. ఈ సంఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గిరిజన సంఘ నాయకులు పోలోజు నాగేశ్వరావు, సోయం శ్రీను తదితరులు ఉన్నారు.