బాధితురాలి చేతికి చేరిన బంగారు గొలుసు | - | Sakshi
Sakshi News home page

బాధితురాలి చేతికి చేరిన బంగారు గొలుసు

Jun 24 2025 4:25 AM | Updated on Jun 24 2025 4:25 AM

బాధితురాలి చేతికి చేరిన బంగారు గొలుసు

బాధితురాలి చేతికి చేరిన బంగారు గొలుసు

సామర్లకోట: విశాఖపట్నానికి చెందిన దంపతులు సామర్లకోటలో పొగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు సోమవారం బాధితురాలికి అందజేశారు. కలిపిరెడ్డి నారాయణమ్మ, జగన్‌మోహన్‌రావు ఆదివారం విశాఖపట్నం నుంచి బంధువుల ఇంటికి వచ్చి స్థానిక స్టేషన్‌ సెంటర్‌లో ఒక హోటల్‌లో అల్పాహారం చేశారు. అనంతరం ఆ దంపతులు రోడ్డుపై పర్సు జాడ విరుచుకున్నారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లిన తరువాత చూసుకొంటే పర్సు కనిపించక పోవడంతో స్థానిక అవుట్‌ పోస్టులోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు మూడు తూలాల బరువైన రూ. మూడు లక్షల విలువ కలిగిన బంగారు గొలుసు పోవడంతో ఎస్సీ ఈ కేసును ఛేదించాలని పోలీసులను ఆదేశించారు. దాంతో ట్రాఫిక్‌ ఎస్సై అడపా గరగారావు అవుట్‌ పోస్టు పోలీసు స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు. ఒక బిచ్చగాడు రోడ్డుపై పడిపోయిన పర్సు తీసుకొని జేబులో పెట్టుకోవడాన్ని గుర్తించారు. వెంటనే ట్రాఫిక్‌ పోలీసులు బిచ్చగాని కోసం గాలింపు చేసి గుర్తించి అతని వద్ద నుంచి పర్సును సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పర్సులో బంగారు గొలుసు ఉండటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు సమాచారం ఇచ్చారు. పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్సీ శ్రీహరిరాజు, సీఐ ఎ.కృష్ణభగవాన్‌, ట్రాఫిక్‌ ఎస్సై అడపా గరగారావు బంగారు గొలుసు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement