
వేటగాళ్ల అరెస్టు
తుపాకీ స్వాధీనం
గండేపల్లి: వన్య ప్రాణులను వేటాడే వ్యక్తులను అరెస్టు చేసినట్టు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని కె గోపాలపురం శివారులో వన్య ప్రాణులను వేటాడేందుకు వచ్చిన వ్యక్తులను ఎస్ఐ శివ నాగబాబు, సిబ్బందితో కలిసి గండేపల్లికి చెందిన జి నాగార్జున, ఎం రాంబాబు, జి సత్తిబాబును అరెస్ట్ చేయగా రాజమహేంద్రవరానికి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి సింగిల్ బ్యారల్ నాటు తుపాకీ, 12 మీడియం ఐరన్ బాల్స్, 65 స్మాల్ ఐరన్ బాల్స్, 3 సెల్ ఫోన్స్, 2 మోటార్ సైకిళ్లు, 2 ఎడ్ టార్చ్ లైట్లు, తుపాకీ ఫైర్ చేయడానికి ఉపయోగించే రెండు రకాల పౌడర్లు స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్టు తెలియజేశారు.