
మహిళా ప్రజా ప్రతినిధులకు శిక్షణ ప్రారంభం
కాకినాడ సిటీ: రాష్ట్రంలో స్థానిక సంస్థల మహిళా ప్రజా ప్రతినిధులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృది పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ఏపీఎస్ఐఆర్డిపీఆర్ ఆధ్వర్యంలో జిల్లా ప్రజాపరిషత్ కాకినాడలో ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ లింగ సమానత్వమే లక్ష్యంగా అనేక విధానాలు అమలులో ఉన్నప్పటికీ, మహిళలు రాజకీయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తక్కువ ప్రాతినిధ్యం పొందుతున్నారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వీవీఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మహిళా సాధికారతతో స్వపరిపాలన సాధ్యం పేరిట ఈ శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. నిధులు, విధులు, భావ వ్యక్తీకీకరణ నైపుణ్యం, ప్రజాస్వామ్య విధుల సులభతరం వంటి అంశాలపై ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు.