నేడు సత్యదేవుని హుండీ లెక్కింపు

ప్రధాన హుండీ నిండిపోవడంతో 
సీల్‌ వేస్తున్న సిబ్బంది - Sakshi

అన్నవరం: సత్యదేవుని ఆలయంలోని హుండీలను మంగళవారం లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 27న లెక్కించారు. 58 రోజుల తరువాత ఇప్పుడు లెక్కించనున్నారు. సుమారు రూ. 3 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధానాలయంలోని ప్రధాన హుండీ కానుకలతో నిండిపోవడంతో ఈ నెల 14న సీల్‌ వేశారు. వివాహాల సీజన్‌ కారణంగా కొద్ది రోజులుగా ఆలయానికి భక్తులు పోటెత్తుతున్న విషయం తెలిసిందే. హుండీ లెక్కింపులో దేవస్థానం ఛైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ చంద్ర శేఖర్‌ అజాద్‌, ఇతర సిబ్బంది పాల్గొంటారు.

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top