రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అన్యాయం

Jul 24 2025 7:24 AM | Updated on Jul 24 2025 7:24 AM

రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అన్యాయం

రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అన్యాయం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో పాలన గాడితప్పి ఎమర్జెన్సీ నడుస్తోందని జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాల్‌ విమర్శించారు. కక్ష సాధింపులతో కూటమి పాలన సాగుతోందన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎకై ్సజ్‌ శాఖకు ఎటువంటి సంబంధం లేకున్నా అన్యాయంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారన్నారు. తప్పుడు ఆరోపణలు, బలవంతపు ఒప్పందాలు, అధికార దుర్వినియోగం ద్వారా కేసులు నమోదు చేయడం కుట్ర కోణాన్ని చెప్పకనే చెబుతోందన్నారు. మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టును ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. తప్పుడు కేసులో ఇరికించి ఇరుకున పెట్టడం చాలా బాధాకరమన్నారు. 2014–19లో మద్యం మాఫియా నడిచిందని, ఇప్పుడు కూడా అదే సాగుతోందని రాష్ట్రం కోడైకూస్తోందన్నారు. రాష్ట్రంలో 4,380 లిక్కర్‌ షాపులు, 43 వేల బెల్ట్‌షాపులు, పర్మిట్‌ రూమ్‌లు ప్రైవేటు మాఫియాకు అప్పగించారన్నారు. ఇటువంటి వాస్తవాలు అన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కక్షపూరిత రాజకీయాలకు కూటమి సర్కార్‌ స్వస్తి పలకాలని విప్పర్తి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసం ఇలా అక్రమ అరెస్టులకు పాల్పడటం సమంజసం కాదన్నారు.

జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement