
భీమేశ్వరాలయ అన్నదాన ట్రస్ట్కు రూ.5 లక్షల విరాళం
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్కి విజయవాడకు చెందిన నాగులపల్లి శ్రీనివాస్, పల్లవి దంపతులు సోమవారం రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. వారి తరఫున విరాళం అందజేసిన ధారా జయరామకృష్ణ శాస్త్రికి ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ట్రిపుల్ ఐటీకి జిల్లా నుంచి
130 మంది విద్యార్థుల ఎంపిక
రాయవరం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి ట్రిపుల్ ఐటీకి మొదటి దశలో 130 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ట్రిపుల్ ఐటీకి ఎంపికై న విద్యార్థుల జాబితాను సోమవారం విడుదల చేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి 32, ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి 19, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి 28, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి 51 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లా నుంచి 3.22 శాతం మంది విద్యార్థులు నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న వారికి ఈ నెల 30 నుంచి జూలై 5వ తేదీ వరకు ఎంపిక చేసిన క్యాంపస్ల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నూజివీడు క్యాంపస్కు ఎంపికై న వారికి ఈ నెల 30, జూలై 1వ తేదీల్లో ఏలూరు జిల్లాలోని నూజివీడు క్యాంపస్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇడుపులపాయ, ఆర్కే వ్యాలీకి ఎంపికై న వారికి ఆర్కే వ్యాలీ క్యాంపస్లో ఈ నెల 30, జూలై 1వ తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూలై 2, 3 తేదీల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికై న వారికి నూజివీడు క్యాంపస్లో, జూలై 4, 5 తేదీల్లో ఒంగోలు క్యాంపస్కు ఎంపికై న వారికి నూజివీడు క్యాంపస్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఆసనాలకు ప్రపంచ బుక్
ఆఫ్ రికార్డులో స్థానం
అమలాపురం రూరల్: కలెక్టర్ ఆర్.మహేష్కుమార్, జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి నేతృత్వంలో జిల్లా యంత్రాంగంఈ నెల మూడో తేదీన అంతర్వేది సముద్ర తీరంలో నిర్వహించిన వృక్షాసనం, భారీ మానవ హారం ఆసనాలు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించాయి. వికసిత్ భారత్లో భాగంగా నిర్వహించిన యోగాంధ్ర మాసోత్సవాల ద్వారా అంతర్వేదిలో నిర్వహించిన వృక్షాసన భారీ మానవహారం ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించడంపై డీఆర్వో రాజకుమారి, డ్వామా పీడీ ఎస్ మధుసూదన్, జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ డీఎల్డీవో రాజేశ్వరరావు, ఎస్డీసీ పి కృష్ణమూర్తి, జిల్లా రవాణా అధికారి డీ. శ్రీనివాసరావు, జిల్లా స్థాయి అధికారుల బృందం కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను అభినందించారు.
అర్జీదారుల సమస్యలకు
పరిష్కారాలు
అమలాపురం రూరల్: అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజకుమారి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి భవన్లోనిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్య క్రమంలో 242 అర్జీలను డీఆర్ఓ రాజకుమారి ఏవో కాశీ విశ్వేశ్వరరావు, సర్వే ఏడీ కె. ప్రభాకర్ డీఎండీఓ రాజేశ్వరరావు స్వీకరించారు.
పోలీస్ గ్రీవెన్స్కు 21 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 21 అర్జీలు వచ్చాయి. ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ నిర్వహించిన ఈ పోలీస్ గ్రీవెన్స్ కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వ చ్చి తమ సమస్యలపై ఫిర్యాదు పత్రాలు అందించారు.

భీమేశ్వరాలయ అన్నదాన ట్రస్ట్కు రూ.5 లక్షల విరాళం