పర్యాటంకాలెన్నో! | - | Sakshi
Sakshi News home page

పర్యాటంకాలెన్నో!

Jun 25 2025 6:48 AM | Updated on Jun 25 2025 6:48 AM

పర్యా

పర్యాటంకాలెన్నో!

మరమ్మతులకు గురైన బోట్లు

ఇక దిండి పర్యాటక కేంద్రంలో 12 ఏళ్ల క్రితం ఒక్కొక్కటీ రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన హౌస్‌బోట్లు మరమ్మతులకు గురయ్యాయి. వీటి జెట్టీలు కూడా శిథిలమయ్యాయి. జెట్టితో పాటు బోటు మరమ్మతులకు రూ.30 లక్షల చొప్పున ప్రతిపాదనలు పంపారు. కాగా వీటి జీవిత కాలం 15 ఏళ్లు కావడంతో మరమ్మతులు చేస్తే మరో ఐదేళ్లు వాటి సేవలను ఉపయోగించుకోవచ్చు. అలాగే నిరుపయోగంగా వదిలేస్తే మరొక మూడేళ్లలో వాటికవే పాడైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఫాంటూన్‌ బోట్ల ఇంజిన్ల కోసం అంచనాలు వేసి పంపారు. ఇక హౌస్‌బోట్ల విభాగంలో సింగిల్‌ హౌస్‌ బోట్లను ప్రవేశపెట్టి దిండి నుంచి నేరుగా గోదావరిలో అంతర్వేది పర్యటనకు ప్రతిపాదించిన ప్రాజెక్టు కూడా అటక్కెక్కింది.

మలికిపురం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా అందుకు అనుగుణంగా వసతుల కల్పన జరగడం లేదు. జిల్లాలో ప్రతిష్టాత్మకమైన దిండి పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధికి కూటమి సర్కారు చేపట్టిన చర్యలు లేకపోగా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మంజూరైన నిధులలో కూడా భారీగా కోత పెట్టింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి సీఎం జగన్‌ దిండి టూరిజం ప్రాజెక్టుకు జనవరిలో రూ.7 కోట్లు మంజూరు చేశారు. పనులను సైతం ప్రారంభించారు. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత నిధుల విడుదలను నిలిపివేసింది. అనంతరం కింది స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు రూ.2 కోట్లు విడుదల చేసింది. దీంతో మూడవ అంతస్తు నిర్మాణానికి అప్పటికే కూలగొట్టిన రెండో అంతస్తును మరమ్మతులతో పాటు గదులను, రెస్టారెంట్‌ను, బార్‌ను రీమోడల్‌ చేసి సరి పెట్టారు. ఇలా దిండి టూరిజం మాత్రమే కాదు.. జిల్లాలో అంతర్వేది, ఓడలరేవు, రాజమహేంద్రవరం వంటి ప్రాంతాల్లో అధునిక వసతుల కల్పనకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు సైతం కూటమి ప్రభుత్వం అటకెక్కించింది.

ఇదే సమయంలో స్థానిక ప్రైవేటు టూరిజం మరిన్ని వసతులు కల్పించి పర్యాటకులతో కళకళలాడుతూ ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటోంది. ఏకంగా రూ.30 కోట్లతో నూతన భవనాలు నిర్మించింది. ఇక్కడి సరోవర్‌ పోర్టికో ఇప్పటికే రూ.కోట్లతో వసతులను ఏర్పాటు చేయడంతో దీనిని మహీంద్ర సంస్థ టేకోవర్‌ చేసింది. మరికొన్ని ప్రైవేటు సంస్థలు సైతం దిండి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నాయి.

అలాగే రాజమహేంద్రవరంలో ప్రవేశపెట్టిన ఫ్లోటింగ్‌ రెస్టారెంట్‌ వంటి ప్రాజెక్టును దిండిలో కూడా ప్రతిపాదించినప్పటికీ ఏ కారణం చేతనో అది అటకెక్కింది. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా పుష్కరాల నిధులతో రాజమహేంద్రవరంలోనే పుష్కర ఘాట్‌ అభివృద్ధి పనులతో పాటు హేవలాక్‌ బ్రిడ్జి అభివృద్ధికి రూ.97.40 కోట్లతో చేపట్టిన పనులు తప్ప పర్యాటకాభివృద్ధికి ఎటువంటి నిధులూ ఇవ్వలేదు.

అమలుకు నోచని పవన్‌ ప్రకటనలు

ఇక జిల్లాలో టెంపుల్‌ టూరిజంతో పాటు గోదావరి పాయలలో పర్యాటకం అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఎన్నో ఎన్నికల హామీలు గుప్పించేశారు. కానీ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. సరికదా గత ప్రభుత్వం ప్రతిపాదించిన పనులు సైతం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పర్యాటక కేంద్రాలలో కనీసం నిర్వహణ నిధులు కూడా రాకపోవడంతో పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. అంతర్వేది నుంచి ద్రాక్షారామ వరకూ టూరిజం హబ్‌ చేస్తానన్న ఆయన హామీలు ఏడాది దాటినా ఒక్కటీ అమలుకు నోచుకోలేదు.

దిండిలో చురుగ్గా నిర్మిస్తున్న

ప్రైవేటు టూరిజం భవనాలు

ప్రతిపాదనలు ఉన్నాయి

ఉమ్మడి జిల్లాలో పర్యాటకాభివృద్ధి, ఆధునిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు చేశాం. అఖండ గోదావరి ప్రాజెక్టులో రూ.97 కోట్లతో రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లను అభివృద్ధికి ప్రతిపాదించాం. ఇందులో హేవలాక్‌ బ్రిడ్జి మాత్రమే ఉంది. మిగిలిన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికీ నిధుల మంజూరుకు కృషి చేస్తున్నాం.

– పవన్‌, ఏపీ టూరిజం ఆర్డీ, రాజమహేంద్రవరం

వసతుల కల్పనలో ఉదాసీనత

పవన్‌ కల్యాణ్‌ హామీలు గాలికి..

టూరిజం హబ్‌కు చర్యలు శూన్యం

అఖండ గోదావరి ప్రాజెక్టులోనూ నిధులు విదల్చని ప్రభుత్వం

గత ప్రభుత్వం మంజూరు చేసిన

నిధుల్లోనూ భారీగా కోత

దయనీయంగా దిండి పర్యాటకం

రూ.కోట్లతో ప్రైవేటు ప్రాజెక్టులు

పర్యాటంకాలెన్నో!1
1/3

పర్యాటంకాలెన్నో!

పర్యాటంకాలెన్నో!2
2/3

పర్యాటంకాలెన్నో!

పర్యాటంకాలెన్నో!3
3/3

పర్యాటంకాలెన్నో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement