ఏసీ బ్లాక్‌ నకిలీ మద్యం గుట్టు రట్టు | - | Sakshi
Sakshi News home page

ఏసీ బ్లాక్‌ నకిలీ మద్యం గుట్టు రట్టు

Jun 25 2025 1:39 AM | Updated on Jun 25 2025 1:39 AM

ఏసీ బ్లాక్‌ నకిలీ మద్యం గుట్టు రట్టు

ఏసీ బ్లాక్‌ నకిలీ మద్యం గుట్టు రట్టు

కొమరిగిరిపట్నం అడ్డాగా దందా

ఎనిమిది మందిని అరెస్టు చేసిన

ఎకై ్సజ్‌ ఏసీ రేణుక బృందం

హైదరాబాద్‌, పాలకొల్లుకు చెందిన

మరో ఇద్దరి కోసం గాలింపు

1065 నకిలీ మద్యం సీసాలు,

ఇతర సామగ్రి స్వాధీనం

అమలాపురం టౌన్‌: అల్లవరం మండలం కొమరిగిరిపట్నంలోని ఓ ఇంటిలో కొన్ని రోజులుగా గుట్టుగా సాగుతున్న నకిలీ మద్యం తయారీ యూనిట్‌ గుట్టును ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.రేణుక బృందం బహిర్గతం చేసింది. కొమరిగిరిపట్నం గ్రామ శివారు ఆకుల వారి వీధిలోని ఓ ఇంటిపై ఎకై ్సజ్‌ అధికారులు సోమవారం మెరుపుదాడి చేసి నకిలీ మద్యం బాటిలింగ్‌ మినీ యూనిట్‌ను, నిర్వాహకులను పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో పట్టుబడ్డ నకిలీ మద్యం సీసాలు, ఇతర సామగ్రిని ఎకై ్సజ్‌ అసెస్టింట్‌ కమిషనర్‌ రేణుక, సూపరింటెండెంట్‌ ఎస్‌కేడీవీ ప్రసాద్‌, సీఐలు, ఎస్సైలు అమలాపురంలోని ఎకై ్సజ్‌ స్టేషన్‌ ప్రాంగణంలో మంగళవారం ప్రదర్శించి వివరాలను విలేకరులకు వెల్లడించారు.

తయారీ ఇలా

ఈ నకిలీ మద్యం ముఠా హైదరాబాద్‌, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతాల నుంచి కేరామిల్‌ లిక్విడ్‌, స్పిరిట్‌ను ముడి సరకుగా దిగుమతి చేసుకుంటోంది. మద్యం రంగు కోసం స్పిరిట్‌లో కేరామిల్‌ లిక్విడ్‌ కలుపుతారు. ఏపీ బేవరీస్‌ లిమిటెడ్‌ తయారీ చేసి సరఫరా చేసే డ్యూటీ పెయిడ్‌ మద్యంలానే నకిలీ మద్యం సీసా తయారు చేసి ఆకర్షణీయమైన లేబుల్‌తో రూపొందిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఏసీ బ్లాక్‌ పేరుతో ఉన్న లేబుల్‌ బాటిల్‌పై అంటించి దానిలో వారు తయారు చేసిన మద్యాన్ని నింపుతున్నట్టు అధికారుల బృందం ప్రత్యక్షంగా గమనించింది. దాడి సమయంలో అక్కడి నుంచి మద్యం తయారీ మెషీన్‌, అప్పటికే తయారు చేసిన 1065 మద్యం సీసాలు, ఆరు వేల ఖాళీ సీసాలు, కేరామిల్‌ లిక్విడ్‌ డబ్బాలు, ఏసీ బ్లాక్‌ పేరుతో ఉన్న లేబుల్‌ బండిల్‌ తదితర సామగ్రిని వారు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మద్యం నిల్వ చేసిన గొడౌన్‌ను, మద్యం సరఫరాకు వినియోగించే ఆటోను వారు సీజ్‌ చేశారు.

పక్కా సమాచారంతో..

రామానుజ తేజ అనే ఓ ఎకై ్సజ్‌ అధికారి సేకరించిన సమాచారంతో ఈ దాడి చేశామన్నారు. ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ప్రసాద్‌, సీఐ వీరాబాబు తదితరులు కూడా ఈ ఆకస్మిక దాడిలో పాల్గొన్నారని తెలిపారు. పాలకొల్లులో కూడా అక్కడి ఎకై ్సజ్‌ అధికారుల బృందం దాడి చేసి 130 లీటర్ల స్పిరిట్‌ను పట్టుకున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న నకిలీ మద్యాన్ని ప్రభుత్వ ఎనాలిసిస్‌ ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయిస్తామన్నారు. ఈ నకిలీ మద్యం రాకెట్‌లో మరికొందరు నిందితులు ఉన్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని రేణుక తెలిపారు.

8 మంది అరెస్టు

ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసినట్టు అధికారులు వివరించారు. అమలాపురం మండలం పేరూరుకు చెందిన చింతపల్లి సోమశేఖర, చవ్వాకుల ప్రేమ్‌కుమార్‌, ఇదే మండలం చిందాడగరువు గ్రామానికి చెందిన నేరేడుమిల్లి సుబ్రహ్మణ్యం, పిల్లా శ్రీనివాస్‌, కాజులూరు మండలం దిద్దుకూరుకు చెందిన నురుకుర్తి శ్రీనివాసరావు, అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన బొర్రా సత్య అప్పారావు, అల్లవరం మండలం కొమరిగిరిపట్నానికి చెందిన పితాని వెంకట దుర్గ సింహాద్రి, తిరుమనాధం దుర్గారావులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రేణుక తెలిపారు. వీరికి హైదరాబాద్‌, పాలకొల్లు నుంచి స్పిరిట్‌, కేరామిల్‌ లిక్విడ్‌ సరఫరా చేస్తున్న ఇద్దరు కీలక నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టమన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే ఒరిజినల్‌ మద్యం బాటిల్‌ రూ.160 ఉంటే వీరు తయారు చేసే నకిలీ మద్యం బాటిల్‌ను రూ.80 నుంచి రూ.120 వరకూ విక్రయిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement