రూ.17,994 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

రూ.17,994 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

Jun 25 2025 6:48 AM | Updated on Jun 25 2025 6:48 AM

రూ.17,994 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

రూ.17,994 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

కలెక్టర్‌ మహేష్‌కుమార్‌

సాక్షి, అమలాపురం: ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.17,994 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ప్రవేశ పెట్టామని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రూ.3,706 కోట్లు అదనంగా ప్రతిపాదించినట్లు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ మంగళవారం తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి బ్యాంకర్లు సమన్వయంతో గేదెలు, ఆవుల నిర్వహణకు సమృద్ధిగా రుణాలు అందించాలని కోరారు. వారి ఆర్థిక అవసరాలకు స్వయం సహాయక సంఘాల డిపాజిట్‌ నిధులు వినియోగించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. టిడ్కో రుణాలు పూర్తిస్థాయిలో అందించాలని, సిడ్బీ ద్వారా స్వయం ఉపాధికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రాజెక్టులకు రుణాల కల్పించాలన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్య రంగానికి రూ.15,472 కోట్లు, మిగిలిన రంగాలకు రూ.2,523 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.17,994 కోట్ల వార్షిక ప్రణాళిక లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు బ్యాంకులు కృషిచేయాలన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి రూ.11,934 కోట్లు, ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.2,871 కోట్లు రుణ లక్ష్యాలను ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌ జోగుళ్ల వేగేశ్వరరావు కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రూ.14.60 లక్షల డ్వాక్రా నిధుల దుర్వినియోగంపై ఆరా తీయగా సంబంధిత ఎస్‌బీఐ అధికారులు సమాధానం ఇస్తూ 16 డ్వాక్రా సంఘాలకు నిధులు మంజూరు సందర్భంలో బీమా సౌకర్యం కల్పించామని, మూడు నెలల్లో వాటిని సంఘాలకు జమ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కోనసీమ జిల్లా 2025–26 పొటెన్షియల్‌ వార్షిక క్రెడిట్‌ ప్లాన్‌ను ఆవిష్కరించారు. జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ కేశవవర్మ, ఆర్‌బీఐ జోనల్‌ అధికారి గిరిధర్‌, యూబీఐ ఆర్‌ఎం రంగయ్య నాయుడు, జిల్లా అధికారులు బ్యాంకర్లు పాల్గొన్నారు.

అన్నదాన భవనానికి

రూ.లక్ష విరాళం

కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి భక్తులు భారీగా విరాళాలు సమర్పిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాస్తవ్యులు కొటికలపూడి నాగ రవీంద్రకుమార్‌, విజయవాణి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ 1,11,116 విరాళంగా సమర్పించారు. స్వామివారి దర్శనానంతరం వారికి దేవస్థానం సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందచేశారు. స్వామివారికి నిత్య కళ్యాణం, ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తులకు అష్టోత్తర నామార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేదాశీర్వచనం, అన్న ప్రసాద విరాళం, వివిధ సేవలు, లడ్డూల విక్రయం, ఆన్‌లైన్‌ తదితర సేవలు ద్వారా ఒక్క రోజు దేవస్థానానికి రూ.3,53,341 ఆదాయం వచ్చినట్టు డీసీ, ఈఓ చక్రధరరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement