
గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
గ్రీవెన్స్లో కలెక్టర్ మహేష్కుమార్
అమలాపురం రూరల్: అర్జీదారుల సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ టి.నిషాంతి, డీఆర్ఓ రాజకుమారి, డ్వామా పీడీ మధుసూదన్, డీఆర్డీఏ పీడీ సాయినాథ్ జయచంద్ర గాంధీ, సర్వశిక్షా అసిస్టెంట్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ జి.మమ్మీతో కలిసి ఆయన అర్జీదారు నుంచి 212 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారుల్లో విశ్వసనీయతను పెంపొందించాలని, గడువు దాటిన అర్జీలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అర్జీదారుడు తన అర్జీ స్థితిని ఆన్లైన్ పోర్టల్ లేదా 1100 కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. జేసీ నిషాంతి మాట్లాడుతూ, అంతర్వేది బీచ్లో ఈ నెల మూడున జరిగే యోగా అభ్యసన గ్రాండ్ ఈవెంట్కు వివిధ శాఖల సిబ్బంది తరలిరావాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్డీసీ పి.కృష్ణమూర్తి, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం పీకేపీ ప్రసాద్, డీఈవో షేక్ సలీంబాషా తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతగా పని చేస్తేనే సంతృప్తి
జిల్లా ఆర్థిక గణాంకాధికారి(సీపీవో) పి.వెంకటేశ్వర్లు ఉన్నత విలువలకు, సాటి ఉద్యోగులకు ఆదర్శమని కలెక్టర్ మహేష్కుమార్ అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వెంకటేశ్వర్లును కలెక్టర్తో పాటు, జేసీ నిషాంతి, ఇతర జిల్లా అధికారులు సోమవారం సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ, బాధ్యతాయుతంగా ఉద్యోగంలో పని చేసినప్పుడే జీవితంలో సంతృప్తి కలుగుతుందన్నారు. ఉద్యోగ పదవీ విరమణ పొందిన వెంకటేశ్వర్లుతో పాటు, ఉప గణాంకాధికారి ఆర్.శంకర్రావు, రాజోలు, కపిలేశ్వరపురం తహసీల్దార్లు ఎన్ఎస్ఎస్ ప్రసాద్, పి.చిన్నారావును కలెక్టర్ శాలువాలతో సత్కరించారు.
పోలీస్ గ్రీవెన్స్కు
18 అర్జీలు
అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 18 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ పోలీస్ గ్రీవెన్స్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. జిల్లాలోని డీఎస్సీలు, సీఐలు, ఎస్సైలు పోలీస్ గ్రీవెన్స్కు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించగానే ఎస్పీ కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు. కొన్ని అర్జీలు ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించినవి ఉండడంతో వారికి ఎస్పీ కౌన్సెలింగ్ చేశారు.

గడువులోగా సమస్యలు పరిష్కరించాలి