పల్లె.. కళ తప్పింది | - | Sakshi
Sakshi News home page

పల్లె.. కళ తప్పింది

May 30 2025 3:11 PM | Updated on May 30 2025 3:11 PM

పల్లె

పల్లె.. కళ తప్పింది

ప్రభుత్వ భవన నిర్మాణాలకు బ్రేక్‌

జిల్లావ్యాప్తంగా 789 గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ సెంటర్ల నిర్మాణాలకు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యాన రూ.229.89 కోట్లతో ఈ పనులకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హయాంలోనే సుమా రు రూ.156.06 కోట్లతో 508 భవనాల నిర్మాణాలు (సుమారు 64.38 శాతం) పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 27 భవనాల నిర్మాణ పనులు మాత్రమే జరుగుతున్నాయి. అవి కూడా నత్తను తలపిస్తున్నాయి. 244 భవనాల నిర్మాణ పనులు ఇంకా మొదలు కాలేదు. 10 భవన నిర్మాణాల పనులు వివిధ కారణాలతో అనుమతుల దశలోనే ఆపేశారు. కొన్ని భవనాల పనులను పునాది దశలోనే నిలిపివేశారు. కూటమి ప్రభుత్వ తీరు చూస్తూంటే ఈ వ్యవస్థలను క్రమంగా ఎత్తేస్తారనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది.

పల్లె.. కళ తప్పింది1
1/2

పల్లె.. కళ తప్పింది

పల్లె.. కళ తప్పింది2
2/2

పల్లె.. కళ తప్పింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement