
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ సచివాలయాలు పూర్తిగా పని చేయడం లేదు. ప్రజలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ధ్రువీకరణ పత్రాలను వలంటీర్లు స్వయంగా అందించేవారు. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందేవి. ఇప్పుడా రోజులు లేవు. ఇప్పుడు జనం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
– షేక్ అహ్మద్ ఆలీషా,
ద్రాక్షారామ, రామచంద్రపురం రూరల్
సక్రమంగా అందని సేవలు
గ్రామ సచివాలయంలో సేవలు సక్రమంగా అందడం లేదు. ఆర్బీకేల ద్వారా అమ్మిన ధాన్యానికి డబ్బులు పడటం లేదు. రబీలో ధాన్యం అంతా అమ్ముకున్న తరువాత మద్దతు ధర కొద్దిమేర పెంచారు. రైతు సేవా కేంద్రాలు నిరుపయోగంగా మారాయి.
– ఎన్.వెంకటేశ్వర్లు, పినపళ్ల, ఆలమూరు మండలం
వెబ్సైట్లు ఓపెన్ చేయాలి
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల సేవలను కొనసాగించాలి. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదవుతున్నా ప్రజలకు ఎలాంటి పథకాలూ అందించకపోవడం దారుణం. రైస్ కార్డులతో పాటు పింఛన్ దరఖాస్తుల వెబ్సైట్లు ఓపెన్ చేసి, ప్రజలకు సేవలను అందించాలి.
– వాసంగి కుమారస్వామి, తొండవరం, అంబాజీపేట

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు