
నాడు గ్రామ స్వరాజ్యానికి పెద్ద పీట
గత ప్రభుత్వ పాలనలో గ్రామ స్వరాజ్యానికి పెద్ద పీట వేశారు. కులం, మతం, రాజకీయం అనే వివక్ష లేకుండా.. ఎక్కడా అవినీతికి తావు లేకుండా.. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు నేరుగా అందించారు. వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను వెతికి మరీ గుర్తించి, సంక్షేమ లబ్ధి చేకూర్చారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించారు. వారి ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ గడప వద్దకే వచ్చేవి. దీనికి సమాంతరంగా పల్లెల్లో అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించారు. గతంలో ఊళ్లో ఒక ప్రభుత్వ భవనం ఉంటే గొప్ప. కానీ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో గ్రామ సచివాలయం, ఇంగ్లిష్ మీడియం విద్య, నాడు – నేడుతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారిన ప్రభుత్వ బడి, ఆర్బీకే, విలేజ్ క్లినిక్.. ఇలా కనీసం రూ.కోటి విలువైన భవనాలు ప్రతి గ్రామంలోనూ సమకూరాయి.