
వంగవీటి మోహనరంగా విగ్రహం ధ్వంసం
కొత్తపల్లి: స్థానిక ఊర చెరువు సెంటర్లో ఉన్న దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం ధ్వంసం చేశారు. దీంతో మోహనరంగా అభిమానులు పిఠాపురం– ఉప్పాడ రోడ్డులో ఊరచెరువు సెంటర్లో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద కూడా బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. ఘటనా స్థలానికి ఎస్సై వెంకటేష్ చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. అభిమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశామని ఎస్ తెలిపారు. గురువారం తెల్లవారు జామున కొత్తపల్లి ఎస్సీ పేటకు చెందిన పెట్టా శ్రీకాంత్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు గుర్తించామన్నారు. విగ్రహానికి సంబంధించి చేతులను విరగ్గొట్టి పక్కనే ఉన్న చెరువులో పడవేశాడు. పలువురు సాక్షుల చెప్పిన సమాచారం ఆధారంగా శ్రీకాంత్పై కేసు నమెదు చేసి అరెస్ట్ చేశామన్నారు.
పిఠాపురం–ఉప్పాడ రోడ్డులో
బైఠాయించిన అభిమానులు
ముద్దాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు