సామర్లకోటలో బార్‌పై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

సామర్లకోటలో బార్‌పై కేసు నమోదు

May 30 2025 3:10 PM | Updated on May 30 2025 3:10 PM

సామర్

సామర్లకోటలో బార్‌పై కేసు నమోదు

సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న అశ్విన్‌ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌పై కేసు నమోదు చేసినట్టు ఎకై ్సజ్‌ సీఐ కె. రామోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి దినపత్రికలో ‘బార్‌ తెగించి అమ్మకాలు’ అనే శీర్షికతో గురువారం ప్రచురితమైన కథనానికి స్పందించి కాకినాడ నార్త్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉదయాన్నే బార్‌లో అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. ఆయనతోపాటు ఎకై ్సజ్‌ సిబ్బంది పాల్గొన్నారు. బార్‌ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెరచి ఉంచవలసి ఉండగా తెల్లవారు జాము నుంచీ బహిరంగంగా అమ్మకాలు చేస్తున్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది.

బాలికపై అత్యాచారం

పోక్సో కేసు నమోదు

కె.గంగవరం: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను మోసం చేసి, ఆనక ముఖం చాటేసిన యువకుడిపై కె.గంగవరం పోలీసులు కేసు నమోదు చేశారు. రామచంద్రపురం డీఎస్పీ బి.రఘువీర్‌ చెప్పిన వివరాల ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పామర్రుకు చెందిన మందపల్లి సాగర్‌ అనే యువకుడు అదే పేటకు చెందిన బాలికతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం బాలిక ఏడవ నెల గర్భవతిగా ఉంది. కొంతకాలంగా సాగర్‌ను పెళ్లి చేసుకోవాలని బాలిక అడుగుతుండడంతో ముఖం చాటేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానిక పెద్దలను అశ్రయించారు. అక్కడ ఫలితం లేకపోవడంతో కె.గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై గురువారం డీఎస్పీ రఘువీర్‌, అమలాపురం మహిళా ఎస్సై గంగాభవాని, కె.గంగవరం ఎస్సై జానీబాషా పామర్రు గ్రామానికి వచ్చి విచారణ నిర్వహించి బాధితురాలు, వారి కుటుంబ సభ్యుల వద్ద నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ సదరు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని, ప్రసుత్తం యువకుడు పరారీలో ఉన్నాడని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

సామర్లకోటలో  బార్‌పై కేసు నమోదు 1
1/1

సామర్లకోటలో బార్‌పై కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement