మాజీ ఎమ్మెల్యే సతీమణికి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే సతీమణికి పరామర్శ

Jun 22 2025 3:42 AM | Updated on Jun 22 2025 3:42 AM

మాజీ ఎమ్మెల్యే సతీమణికి పరామర్శ

మాజీ ఎమ్మెల్యే సతీమణికి పరామర్శ

చిత్తూరు కార్పొరేషన్‌: పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సతీమణి నీరజ అనా రోగ్యం కారణంగా చిత్తూరులోని బీవీరెడ్డి కాలనీలో బంధువుల నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆమెను శనివారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సతీమణి స్వర్ణలత, కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పరామర్శించారు. యోగక్షేమాలు తెలుసుకొని ధైర్యంగా ఉండాలని చెప్పారు. తొలుత నగరంలోని దొడ్డిపల్లె సప్తకనికలమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనంజయరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, చుడా మాజీ చైర్మన్‌ పురుషోత్తంరెడ్డి, మొదలియార్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్‌, మున్సిపల్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు శ్రీధర్‌రెడ్డి, ఆను, అన్బు, మురళీరెడ్డి, చక్రి, ప్రసన్న, మనోజ్‌రెడ్డి, శేఖర్‌, అల్తాఫ్‌, స్టాండ్లీ పాల్గొన్నారు.

కళ్యాణ్‌పై పీడీ యాక్టు

పలమనేరు: పట్టణంలోని మొండోళ్ల కాలనీకి చెందిన ఎం.కళ్యాణ్‌(30)పై పీడీ యాక్టు నమోదు చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలించినట్టు పలమనేరు డీఎస్పీ డేరంగుల ప్రభాకర్‌ శనివారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసుతోపాటు మరో పది నేరాలు కళ్యాణ్‌పై ఉన్నాయన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో పీడీ చట్టాన్ని నమోదు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement