
గౌరవం లేనప్పుడు.. కుర్చీలెందుకు?
నగరి: ప్రజా ప్రతినిధులైన తమను అడుగడుగునా అధికారులు అవమానపరుస్తున్నారని, గౌరవం లేనపుడు సర్వసభ్య సమావేశంలో కుర్చీలపై ఎందుకు కూర్చోవాలంటూ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కో–ఆప్షన్ సభ్యులు నేలపై కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక వెలుగు కార్యలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధులు నేలపై కూర్చోవడంతో విస్తుపోయిన అధికారులు అలాగే నిలబడ్డారు. ఎంపీడీఓ కృష్ణయ్య సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా అధికారుల వ్యవహార శైలిపై సభ్యులు నిప్పులు చెరిగారు. ఎంపీపీ భార్గవి, జడ్పీటీసీ సభ్యుడు గాంధీ మాట్లాడుతూ గ్రామాల్లో ఏ పనులు జరుగుతున్నాయో, అవి ఎవరు చేస్తున్నారో, ఏ అధికారులు వస్తున్నారో సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, చివరకు ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులకు కూడా తెలియని ప రిస్థితి ఉందన్నారు. పథకాలకు ఎవరు అర్హులవుతు న్నారో, ఎవరు అనర్హులవుతున్నారో ఇదివరలో జా బితాను ప్రజాప్రతినిధులకు ఇచ్చేవారని ప్రస్తుతం అలా జరగడం లేదన్నారు. చెరువు ఆయకట్టు కమి టీని ఎన్నుకున్న విషయం కూడా ప్రజాప్రతినిదుల దృష్టికి రాలేదన్నారు. పాస్ ఆర్డరు అయిన రూ.45 లక్షల బిల్లులు చెల్లించకుండా ఆపి ఉంచారని, ఏవే వో కారణాలు చెబుతూ జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గౌరవం లేదు.. గౌరవ వేతనం కూడా లేదు
ఏడాది కాలంగా గౌరవంతోపాటు గౌరవ వేతనం కూడా ఆగిపోయిందన్నారు. దీనిపై ఎంపీడీఓ వారి కి సమాధానమిస్తూ ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తానని, రెండు రోజుల్లో పాస్ఆర్డరు అయిన బిల్లుల చెల్లింపు జరిగేలా చూస్తానని సభ్యులకు హా మీ ఇచ్చారు. అందరూ కుర్చీల్లో కూర్చోవాలంటూ కోరారు. దీనిపై సభ్యులు మాట్లాడుతూ రెండు రో జుల వరకు సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తామని ఆలోపు పరిష్కరించకుంటే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రోడ్డెక్కుతామన్నారు. ఆ పై అందరూ కుర్చీలపై కూర్చోగా సమావేశం ప్రా రంభమైంది. అధికారులు వారి రంగాల్లో జరుగుతు న్న పనులను సభ్యులకు వివరించారు. మామిడి త రలింపునకు ఇక్కడే టోకెన్లు ఇవ్వాలని, 108 వాహనం మునుపటిలా రావడంలేదని, గ్రావెల్ తరలింపు ఆపాలని సభ్యులు అధికారులను కోరారు. వైస్ ఎంపీపీలు వెంకటలక్ష్మి, కన్నియప్ప పాల్గొన్నారు.