
ఆర్టీసీ బస్సు డ్రైవర్కు కన్నీటి వీడ్కోలు
గంగాధర నెల్లూరు : ఆర్టీసీ బస్సు డ్రైవర్ లక్ష్మీ కరుణాకుమార్ రెడ్డికి తూగుండ్రంలో కుటుంబ సభ్యు లు, బంధువుల అశ్రునయనాలతో అంత్యక్రియ లు నిర్వహించారు. తూగుండ్రం గ్రామానికి చెంది న ఆర్టీసీ బస్సు డ్రైవర్ లక్ష్మీ కరుణాకుమార్ రెడ్డి శు క్రవారం ఉదయం చిత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్లే బస్సును ప్రయాణికులతో తీసుకెళుతుండగా మార్గమధ్యలో హోస్కోట వద్ద శుక్రవారం తెల్లవా రుజామున జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్ర గా యాల పాలైన డ్రైవర్ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వ హించి పోలీసులు బంధువులకు అప్పగించారు. ఆదివారం ఉదయం స్వగ్రామానికి మృతదేహం చేరింది. ఆర్టీసీ ఉద్యోగులతో పాటు డిపో మేనేజర్ రూపశ్రీ కలిసి డ్రైవర్ మృతదేహానికి నివాళులర్పించారు. డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, తక్షణ సాయం కింద 25 వేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందించారు. తూగుండ్రం సర్పంచ్ శ్రీ బాబు, ఎంపీటీసీ వాణిశ్రీ, పలు పార్టీ నేతలు నివాళులర్పించారు.