
ట్యాంకర్ ఢీకొని యువకుడి మృతి
వడమాలపేట (విజయపురం ) : వడమాలపేట మండలం తిరుపతి– చైన్నె జాతీయ రహదారిపై కదిరి మంగళం బైపాస్ వద్ద ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో చంద్రశేఖర్ (35) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకొంది. పోలీసు కథనం మేరకు వివరాలు ఇలా.. వడమాలపేట కట్టకింద ఎస్టీ కాలనీకి చెందిన చంద్రశేఖర్ కదిరి మంగళం బైపాస్ వద్ద రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి చైన్నె వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య సుభాషిణి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా వర్కర్గా విధులు నిర్వహిస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ధర్మారెడ్డి తెలిపారు.