
ప్రైవేటు ఆస్తి.. ప్రభుత్వ గుర్తింపు
ఒకే ఒక్కడు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వాడుకునేందుకు మినహా మరే విధంగానూ అక్కరకు రాకుండా ఉన్న కోట్ల విలువైన ఆస్తికి వైఎస్సార్సీపీ సర్కారు అధికారిక ముద్ర వేసింది. గత ఐదేళ్ల పాటు జిల్లాలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం నిర్వహించి ఆస్తి యాజమాన్య ధ్రువపత్రాలను అందజేశారు. గ్రామాల్లో ఉండే ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర ఖాళీ స్థలాలకు వాటి యజమానుల పేరిట సర్టిఫికెట్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ సర్కారు చేపట్టింది. గతంలో ఎవరైనా ఆస్తి అమ్ముకోవాలంటే పెద్ద మనుషులు మధ్య కాగితాలు రాసుకోవాల్సిందే తప్ప ఆ పత్రాలకు ఎలాంటి అధికారిక గుర్తింపు ఉండేది కాదు. అన్నదమ్ములు ఆ ఆస్తిని పంచుకోవాలన్నా ఇబ్బంది ఉండేది. అటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న గత వైఎస్సార్సీపీ సర్కారు గ్రామ కంఠంలో ఉండే ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర స్థలాలన్నింటికీ క్యూఆర్ కోడ్ తో కూడిన ఆస్తి సర్టిఫికెట్లను జారీ చేసింది.
జిల్లాలో రెవెన్యూ డివిజన్ల వారీగా అమలు చేసిన పథకం వివరాలు
డివిజన్ మండలాలు లబ్ధి చేకూర్చిన
పేరు భూమి వివరాలు (ఎకరాల్లో)
చిత్తూరు 304 4,42,219.17
నగరి 107 1,41,125.65
పలమనేరు 201 5,01,855.98
కుప్పం 210 2,16,996.82
మొత్తం 822 13,02,224.62