
భక్తిశ్రద్ధలతో బక్రీద్
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని అయ్యోర్లకు వేసవి సెలవుల ప్రారంభం నుంచే బదిలీలు, ఉద్యోగోన్నతుల కసరత్తు మొదలైంది. ఈ కసరత్తు వేసవి సెలవులు పూర్తి కావొస్తున్నా ఇంత వరకు పూర్తికాని దుస్థితి నెలకొంది. విద్యాశాఖ అధికారుల వద్ద ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితా సరిగా లేకపోవడం, ఆన్లైన్ విధానంలో నిర్వహించిన బదిలీల్లో దరఖాస్తుల నమోదు దగ్గర నుంచి బదిలీల ఉత్తర్వుల జారీ అయ్యే వరకు అన్నీ సమస్యలే ఎదురవడం అయ్యోర్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీచర్లు నిత్యం చిత్తూరు విద్యాశాఖ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. సమస్యలు విన్నవిస్తున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
క్రిమినల్ కేసులు పెడతామని బెదిరింపులు
బదిలీల్లో అవకతవకలు, సమస్యలు పరిష్కరించాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు. దీనికితోడు ‘రాష్ట్ర విద్యాశాఖ అధికారులను వెళ్లి అడగండి’.. అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నట్టు అయ్యోర్లు ఆరోపిస్తున్నారు. బదిలీలు ఆన్లైన్ విధానంలో జరిగాయి.. మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చేతులు పైకెత్తేస్తున్నట్టు సమాచారం. గట్టిగా అడిగితే వారిపై క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో జరుగుతున్న ఈ తతంగంపై క్షేత్ర స్థాయిలో అయ్యోర్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇదేందయ్యా లోకేశం!
బదిలీల్లో అవకతవకలు, గందరగోళంపై ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని టీచర్లు, నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ సారూ.. ఇవేం బదిలీలయ్యా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ఇచ్చిన నిబంధనల ప్రకారం బదిలీలు నిర్వహించాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే ఎస్జీటీల బదిలీలు మాన్యువల్ విధానంలో నిర్వహించాలని కోరుతున్నారు. మాట తప్పి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆదేశిస్తుండడంపై అయ్యోర్లు, నాయకులు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 8న డీఈవో కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. మరికొంత మంది డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
ముప్పుతిప్పలు పెడుతున్న కూటమి ప్రభుత్వం
నిబంధనలకు విరుద్ధంగా బదిలీల ఉత్తర్వులు
ఎస్జీటీలకు హ్యాండిచ్చిన వైనం
రాష్ట్ర విద్యాశాఖ అధికారులను వెళ్లి అడగండంటూ నిర్లక్ష్య సమాధానం
ఆప్షన్ల బాయ్కాట్కు పిలుపునిచ్చిన ఐక్య ఉపాధ్యాయ సంఘ నాయకులు
ఇవిగో సమస్యలు
ఉద్యోగోన్నతులు పొందలేక నష్టపోతున్న 610 జీవో బాధిత పీఈటీలకు న్యాయం చేయాలి.
ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి.
క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్ ఖాళీలతో కలిపి ముందుగా ఇచ్చిన ఆప్షన్న్ మేరకు బదిలీ ఉత్తర్వులు విడుదల చేయాలి.
రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ బదిలీల వెబ్ సైట్లో తప్పనిసరి బదిలీగా చూపడం అన్యాయం.
తుది సీనియారిటీ జాబితా విడుదల చేయకుండా, ఉపాధ్యాయుల గ్రీవెన్స్ పరిష్కారం కాకుండానే ఆప్షన్ పెట్టుకోవాలని ఒత్తిడి చేయడం బాధాకరం
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎంపిక చేసుకున్న ఖాళీలను కేటాయించకపోవడంతో తర్వాత సదరు ఖాళీలను పదోన్నతుల్లో చూపడం వల్ల సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోతున్నారు.
కొన్ని ఖాళీలను సీనియర్ ఉపాధ్యాయులు ముందుగా బదిలీ కోసం ఎంపిక చేసుకున్నప్పటికీ వారికి కేటాయించకుండా జూనియర్లకు కేటాయించారు
కొన్ని పాఠశాలల్లో ఒక పోస్టు ఖాళీగా ఉండగా సదరు ఖాళీ పోస్టును ఇద్దరు ఉపాధ్యాయులకు కేటాయించడం..
ప్రాధాన్యత కేటగిరి ఉపాధ్యాయులు వారి ప్రాధాన్యతను రద్దు చేసుకుని జనరల్ కేటగిరి కింద ఆప్షన్ ఇవ్వగా సదరు ఎంపిక చేసుకున్న స్థానాలను వారికి కేటాయించకుండా జూనియర్లకు కేటాయించడం..
కూటమి ప్రభుత్వం ఆన్లైన్ విధానంలో చేపడుతున్న ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్లో సీనియారిటీ జాబితాల్లో అవకతవకలు, బదిలీల కసరత్తులో నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు రావడం విమర్శలకు తావిస్తోంది. ఫ్రిపరెన్షియల్ కేటగిరీ నమోదు చేసుకున్న టీచర్లకు దూరంగా పోస్టింగ్లు ఇవ్వడం, కొందరికై తే బదిలీల ఉత్తర్వులు జారీచేయకపోవడం కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న బదిలీల కసరత్తుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
ఉపాధ్యాయులకు ముచ్చెమటలు
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని అయ్యోర్లకు కూటమి ప్రభుత్వం ముచ్చెమటలు పట్టిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బదిలీలు, ఉద్యోగోన్నతుల రూపంలో కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఈ బదిలీల కసరత్తులో చిత్ర విచిత్ర సమస్యలను సృష్టిస్తోంది. వాటిని పరిష్కరించకుండా ఏకపక్షంగా బదిలీల కసరత్తును ముందుకు సాగిస్తోంది.
పేరుకే నిబంధనలు
టీచర్ల బదిలీల కసరత్తుకు జారీచేసిన జీవోలు, నిబంధనలు పేరుకు మాత్రమేనని టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కసరత్తు మొత్తం విద్యాశాఖ అధికారులు ఇష్టానుసారంగా, గందరగోళంగా నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. బదిలీల్లో నిబంధనల ప్రకారం వారికి నమోదయ్యే పాయింట్ల ప్రకారం వెబ్ ఆప్షన్లను ఆన్లైన్లో నమోదు చేసుకున్నా ప్రయోజనం లేకపోతోందని వాపోతున్నారు.
తీవ్రమైన అన్యాయం
ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని కచ్చితమైన బదిలీలు పొందే టీచర్లకు తీవ్రమైన అన్యాయం జరిగింది. నమోదు చేసుకున్న ప్రాంతాల్లో పోస్టింగ్లు ఇవ్వలేదు. ఇష్టానుసారంగా బదిలీలు చేశారు. గవర్నమెంట్ మేనేజ్మెంట్ పరిధిలోని అన్ని సబ్జెక్టుల టీచర్లకు ఈ సమస్య ఉంది. విద్యాశాఖ మంత్రి చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలి.
– ఉజ్వల, స్కూల్ అసిస్టెంట్

భక్తిశ్రద్ధలతో బక్రీద్

భక్తిశ్రద్ధలతో బక్రీద్

భక్తిశ్రద్ధలతో బక్రీద్

భక్తిశ్రద్ధలతో బక్రీద్

భక్తిశ్రద్ధలతో బక్రీద్

భక్తిశ్రద్ధలతో బక్రీద్

భక్తిశ్రద్ధలతో బక్రీద్

భక్తిశ్రద్ధలతో బక్రీద్