
నేడు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి
వెబ్ కౌన్సెలింగ్ వద్దు..మాన్యువల్గా చేపట్టాలని డిమాండ్
– వెల్లడించిన ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ వద్దని..మాన్యువల్ కౌన్సెలింగ్ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు నగరంలోని ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీయూఎస్ సంఘ రాష్ట్ర నేత బాలాజీ మాట్లాడుతూ ఇన్నాళ్ల పోరాటంలో తాము ఎదైతే డిమాండ్ చేశామో..ఆ డిమాండ్లకు విరుద్ధంగా ప్రస్తుతం కౌన్సెలింగ్ నడుస్తోందన్నారు. బదిలీలు, పదోన్నతులు, క్లస్టర్ల విభజన తదితర విషయాల్లో పాదర్శకత కనిపించడం లేదన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. వెబ్ కౌన్సెలింగ్తో ఎస్జీటీలు ఇబ్బంది పడాల్సి వస్తోందని, ఈ కౌన్సెలింగ్ను మాన్యవల్ చేపట్టాలని రాష్ట్ర విద్యశాఖ కార్యదర్శి, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారు కూడా ఇందుకు అంగీకరించారని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అలా జరగడం లేదన్నారు. ఈ వెబ్ కౌన్సెలింగ్లో ప్రధానంగా సీనియర్లకు అన్యాయం జరుగుతోందని, సాంకేతిక సమస్యలతో కౌన్సెలింగ్ మొత్తం గందరగోళంగా మారిందన్నారు. దీనిపై ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. రాష్ట్ర కార్యదర్శి జీవీ.రమణ మాట్లాడుతూ వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేసి..మాన్యవల్ పద్ధతిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తే సమస్యలు ఉండవన్నారు. ఈ వెబ్ఆప్షన్ వల్ల జూనియర్లు..సీనియర్లుగా, సీనియర్లు..జూనియర్లుగా అవుతారని వాపోయారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ వెబ్ కౌన్సెలింగ్ వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ఈ సమస్యలను పరిష్కారానికి ఐక్యవేదిక పిలుపు మేరకు ఆదివారం జిల్లా విద్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు తెలిపారు. సమావేశంలో ఉద్యోగ సంఘ నేతలు గోవిందస్వామి, విజయభాస్కర్, మణికంఠ, నాగరాజు, నరేంద్రరెడ్డి, జయకాంత్, చంద్ర, కిషోర్ పాల్గొన్నారు.

నేడు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి