విత్తనంపై పెత్తనం | - | Sakshi
Sakshi News home page

విత్తనంపై పెత్తనం

Jun 4 2025 12:48 AM | Updated on Jun 4 2025 12:48 AM

విత్త

విత్తనంపై పెత్తనం

వేరుశనగ విత్తన పంపిణీపై స్థానిక ప్రజాప్రతినిధులు పెత్తనం చేస్తుండడంపై సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

టీబీపై అప్రమత్తం

టీబీపై అప్రమత్తంగా ఉండి , ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్‌ కోరారు.

బుధవారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2025

ఎన్నికల ముందు టీడీపీ సూపర్‌సిక్స్‌ హామీలంటూ ప్రజలను బురిడీ కొట్టించింది. కూటమి ప్రభుతం కొలువుదీరి ఏడాది పూర్తవుతోంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. సూపర్‌ సిక్స్‌లో ఏ ఒక్కటీ అమలు చేసి ఉంటే ఒట్టు..హామీల ముసుగులో గద్దెనెక్కిన చంద్రబాబు సూపర్‌–6 హామీలు నెరవేర్చాలంటే భయమేస్తోందంటూ ప్లేటు ఫిరాయించేశారు. దీంతో ప్రజలు మోసపోయాం బాబూ అంటూ నెత్తినోరు కొట్టుకుంటున్నారు.

అమ్మ ఒడి నిధుల పంపిణీ కార్యక్రమంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ (ఫైల్‌)

పంటల సాగుకు పెట్టుబడి ఇవ్వండి

పంట సాగుకు పడే తి ప్పలు అన్ని ఇన్నీ కా వు. తొలకరి వర్షాలు పడుతున్నాయి. అప్పటి సీఎం జగన్‌ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా రై తు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అ న్నదాత సుఖీభవ కింద రూ.20 వేల రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు పైసా అందలేదు. – దాస్‌, చిన్నలూర్‌, నగరి మండలం

ఇంటి స్థలాలు ఏవీ..

ఓట్ల కోసం ఎన్నికల సమయంలో అమలు కు నోచుకోని హామీలు ఇచ్చి ఏమి లాభం. ప్ర జలను మభ్యపెట్టేందు కు ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలు సరికా దు. మూడు సెంట్ల ఇంటి స్థలం ఇస్తామంటూ పేద ప్రజలను నిలువునా మోసం చేశారు.

– శోభన్‌ బాబు, కత్తెరపల్లి, కార్వేటినగరం మండలం

ఉచిత బస్సు ఇంకెప్పుడిస్తారు..

అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ఎన్నికల ప్రచారంలో చెప్పా రు. ఇప్పుడేమో ఆ ఉచి త ప్రయాణం ఎప్పుడో చెప్పే నాథుడే లేరు. ఇలాంటి అమలు కాని హామీలు ఎందుకు ఇవ్వాలి. మోసం చేసే విధంగా హామీలు ఇవ్వడం సరైంది కాదు.

– దీప, పాలసముద్రం మండలం

చిత్తూరు కలెక్టరేట్‌ : హామీల ముసుగులో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ లను నెరవేర్చడంలో విఫలమైంది. సూపర్‌–6 హామీలు నెరవేర్చాలంటే ఖజానాలో డబ్బులు లేవంటూ చంద్రబాబు ప్లేట్‌ ిఫిరాయించేసరికి ప్రజ లు అవాక్కయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి వెన్నుపోటు పాలనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ బుధవారం వెన్నుపోటు దినం గా ప్రకటించింది. వెన్నుపోటు దినం కార్యక్రమంలో కూటమి పాలనలో మోసానికి గురైన ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.

ఎన్నికలు వచ్చాయంటే గాల్లో మేడలు..

ఎన్నికలు వచ్చాయంటే చాలు చంద్రబాబు గాల్లో అద్దాల మేడలు కట్టేస్తారు. తీరా అధికారంలోకి వచ్చాక ఓట్లేసి గెలిపించిన ప్రజలను పక్కన పెట్టి తన నిజ స్వరూపం చూపిస్తారు. ఈసారి అధికారంలోకి వచ్చిన కూటమి టీడీపీ గతం లానే ప్రజలను నయవంచనకు గురి చేసింది. ఎన్నికలకు ముందు సూపర్‌సిక్స్‌ అంటూ ఊరూరా తిరిగి ఉదరగొట్టారు. ఆ పార్టీ నాయకులను ఇంటింటికీ పంపించి కరపత్రాలను పంచారు. అంతే కూటమి టీడీపీ గద్దెనెక్కాక ఆ పార్టీ మేనిఫెస్టో మాయమై పోయింది.

గొప్పలు చెప్పారు.. గొయ్యితీసి పాతి పెట్టారు..

● జిల్లాలో గత ఏడాది మే నెలలో పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. సూపర్‌ 6 పథకాలు కావాలంటే టీడీపీకే ఓటెయ్యాలి. కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకొచ్చి చిత్తూరు అభివృద్ధికి కృషి చేస్తా. టీడీపీ అధికారంలోకి వస్తే వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా. సూపర్‌ 6 పథకాలు అమలు చేసి తీరుతామని స్వయాన ప్రస్తుత సీఎం చంద్రబాబు హామీలు ఇచ్చి గొప్పలు చెప్పారు. హామీలు ఇచ్చి ఇప్పటికి ఏడాది అవుతున్నా ఆ హామీలు ఏమయ్యాయో ఆయనకే తెలియాలి.

● పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ గత ఏడాది ఏప్రిల్‌ 20వ తేదీన పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లెల్లో పర్యటించారు. ఆ పర్యటనలో ఇంటింటికి వెళ్లి సూపర్‌ 6 పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా సరే వారందరికీ తల్లికి వందనం పథకం నగదు అందజేస్తాం. నమ్మి ఓట్లు వేయండి.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు అందజేస్తామన్నారు. ఏడాది పూర్తి అవుతున్నా తల్లికి వందనం పథకం ఎక్కడ అని ఆ నియోజకవర్గ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.

● గత ఏడాది ఏప్రిల్‌ 26 వ తేదీన గుడిపాల మండలం ఎన్నికల ప్రచారంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ పాల్గొన్నారు. ఆ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతుకు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసి రూ.20 వేలు సాయం అందజేస్తామన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అమలు కాక రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కూటమి రైతులకు ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేదు.

● గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో సూపర్‌ 6 పథకాల పై ఎమ్మెల్యే థామస్‌ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేస్తారంటూ గొప్పలు చెప్పారు. ఏడాది పూర్తి అవుతుండడంతో ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీలు ఏమయ్యాయి సారూ అంటూ ఆ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

● గత ఏడాది ఏప్రిల్‌ 20వ తేదీన పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఇంటింటికి వెళ్లి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ఉదరగొట్టారు. ఇప్పటికీ ఏడాది పూర్తి అవుతున్నా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఊసే లేకపోవడంతో ఆ నియోజకవర్గంలో మహిళలు పెదవి విరుస్తున్నారు.

● నగరి నియోజకవర్గం నిండ్ర మండలం లో గత ఏడాది ఏప్రిల్‌ 22వ తేదీన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ పాల్గొని నిరుద్యోగులకు హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అప్పటి వరకు ఉన్నత చదువు చదివిన ప్రతి యువకుడికి ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏడాది పూర్తవుతున్నా ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి జాడే లేదు.

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

కూటమి ఏడాది పాలనలో హామీలు గాలికి

ప్రజాసంక్షేమం గాలికొదిలేసిన సర్కారు

అవినీతి, మోసం, కుట్రతో కూటమి పాలన

నేడు వెన్నుపోటు దినంకు పిలుపునిచ్చిన వైఎస్సార్‌సీపీ

విత్తనంపై పెత్తనం
1
1/7

విత్తనంపై పెత్తనం

విత్తనంపై పెత్తనం
2
2/7

విత్తనంపై పెత్తనం

విత్తనంపై పెత్తనం
3
3/7

విత్తనంపై పెత్తనం

విత్తనంపై పెత్తనం
4
4/7

విత్తనంపై పెత్తనం

విత్తనంపై పెత్తనం
5
5/7

విత్తనంపై పెత్తనం

విత్తనంపై పెత్తనం
6
6/7

విత్తనంపై పెత్తనం

విత్తనంపై పెత్తనం
7
7/7

విత్తనంపై పెత్తనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement